రాముడు మంచి బాలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తాడు. ‘రామం’ అంటేనే ఆనందమని అర్థం కదా! అలాగే ఉంటాడు. ఆయనలో ఈర్ష్య, అసూయ, గర్వం వంటివి మచ్చుకైనా లేవు. ఎవరైనా ఉపకారం చేస్తే సంతోషిస్తాడు. అపకారం చేస్తే, పోన్లే, వాడి పాపాన వాడే పోతాడనుకుంటాడు. చప్పున ఆయనకు కోపం రాదు. వచ్చిందా అది కాలాగ్నే. ధర్మమూర్తి. తాను ధర్మం తప్పడు. ఇతరులను తప్పనివ్వడు. అలాంటి రాముడికి దశరథుడు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలని పెద్దసభ ఏర్పాటు చేశాడు.
అందరూ వచ్చారు. దశరథ మహారాజు ఏమి చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు. రాజుగారు సభ ముందుకు వచ్చి ‘నేను పెద్దవాడినయ్యాను. రాజ్యం చేయలేకుండా ఉన్నాను. మీరంతా అంగీకరిస్తే నా పెద్దకుమారుడు రాముడిని పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి’ అన్నారు. అలా అనడమే తడవు. అయోధ్యవాసులంతా ఆనందంతో చప్పట్లు చరిచారు. ‘రాముడే మా దేవుడు. ఎప్పుడెప్పుడాయన సింహాసనం ఎక్కుతాడా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. దయగల తండ్రి. మమ్మల్ని ఆయనే పాలించాలి’ అన్నారు. ఆ మాటలకు దశరథుడు సంతోషించాడు. ‘కానీ, మీరంతా రాముడే ప్రభువు కావాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పండి. నా పాలన మీకు నచ్చడం లేదా?’ అని అడిగాడు
‘ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరిస్తాడు. మా యోగక్షేమాలు విచారిస్తాడు. మాకు కష్టం వస్తే ఆదుకుంటాడు. సంతోషం కలిగితే ఆనందిస్తాడు. ప్రజలను ఎలా పాలించాలో ఆయనకు బాగా తెలుసు. తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఒప్పు చేస్తే మెచ్చుకుంటాడు. ఆయన ఏలుబడిలో మాకు సుఖసంతోషాలు, రక్షణ లభిస్తాయన్న నమ్మకం మాకుంది. అతడే మాకు రాజు’ అన్నారు.
దశరథుడు ఆనందపడ్డాడు. కొడుకును దగ్గరకు పిలిచి ‘రామా! అయోధ్యవాసులందరికీ నువ్వంటే ఎంత ప్రేమో చూశావుగా, నీ సుగుణాలకు మెచ్చి, నిన్ను రాజుగా కోరుకుంటున్నారు. ఇంకా వినయం నేర్చుకో, కోపతాపాలను పూర్తిగా విడిచిపెట్టు. కోశాగారాన్నీ ఆయుధాగారాన్నీ ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకో. పెద్దల్నీ పిల్లల్నీ మిత్రుల్నీ సంతోషపెడుతూ ఉండు. యజ్ఞయాగాలు చేస్తూ ఉండు. ప్రజలను చక్కగా పాలించడం కన్నా ఏదీ ముఖ్యం కాదు. గుర్తుంచుకో’ అని కొడుకును గుండెలకు హత్తుకున్నాడు.
తండ్రిని సత్యసంధుడిని చేసేందుకు రాముడు రాజ్యాన్ని త్యజించాడు.
అరణ్యాలకు వెళ్లాడు. అప్పుడు అయోధ్య కన్నీరుమున్నీరైంది. రాముడు అయోధ్య వదిలి వెళ్లాక ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఆకలి లేదు, అన్నం లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. రాముడిని వెనక్కి తీసుకురాలేకపోయినందుకు భర్తల్ని భార్యలు అసహ్యించుకున్నారు. ‘ఛీ! పాడు బతుకు. మా రాముడే లేకపోయాక ఈ ఇళ్లెం దుకు, వాకిళ్లెందుకు, భోగమెందుకు, భాగ్యమెందుకు?’ అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అయోధ్యలో ప్రజలంతా ఇలా ఉంటే పశువులదీ ఇదే పరిస్థితి. పాలివ్వడం మానేశాయి. అయో ధ్య అంతా దీనంగా తయారయింది. బీడు పడ్డట్టుగా ఉంది. ఇదీ పాలకులకూ ప్రజలకూ మధ్య ఉండాల్సిన ప్రేమ బంధం.
-ప్రయాగ రామకృష్ణ
రామరాజ్యం
Published Tue, Apr 8 2014 1:54 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement