దుక్కితోపాటే విత్తనం/ఎరువు వేసే పరికరానికి
రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ కాలేజీ
ఇసుక, తువ్వ, తేలిక నేలల్లో కాలికి గట్టి మట్టి పెళ్ల తగలదు. కానీ, ఎంత ఇసుక భూములైనా పంటలు సాగు చేయాలంటే దుక్కి చేయకతప్పదు కదా. ఈ భూములను విస్తారంగా సాగుచేసే పెద్ద రైతులైతే ట్రాక్టర్తో దుక్కి చేసుకొని విత్తనం వేసుకుంటారు. కానీ, పావెకరం, అరెకరం, ఎకరం సాగు చేసుకునే బక్క రైతుకు ట్రాక్టర్ అద్దె చెల్లించడం భారమే. కాడెద్దుల కోసం అక్కడా ఇక్కడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అరక కూడా అవసరమైన రోజు దొరుకుతుందన్న నమ్మకమూ లేకుండా పోయింది.
ఈ ఇబ్బందుల్లేకుండా ఇసుక, తువ్వ నేలల్లో పంటలు సాగు చేసే రైతు తనంతట తాను దుక్కి చేసుకోవడంతోపాటు విత్తనం వేసుకునేందుకు ఉపయోగపడే పరికరం అందుబాటులో ఉంటే.. ఎంత బాగుంటుంది? ఇంధనం అవసరం లేకుండా.. మరో మనిషి అవసరం కూడా లేకుండా కావాలనుకున్నప్పుడు, ఒక్కరే సులభంగా వ్యవసాయ పనులు నిశ్చింతగా చేసుకోగలిగితే.. ఎంత బాగుంటుంది? ఈ ప్రశ్నల్లోంచే చిన్న రైతుకు చేదోడుగా నిలిచే పరికరం రూపొందింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. లక్ష్మణరావు మార్గదర్శకత్వంలో బీటెక్ విద్యార్థులు పి.రవిచంద్ర, వై. శివకిరణ్ ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని తొలుత రెండు సైకిళ్లను వినియోగించి తయారు చేశారు. ఇద్దరు మనుషులు నడపాల్సి ఉండడం, ఇతరత్రా సమస్యల వల్ల అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత రెండు సైకిల్ చక్రాలతో కూడిన పరికరానికి విజయవంతంగా రూపుకల్పన చేశారు.
రైతులు సంతృప్తిని వ్యక్తం చేయడంతో పేటెంట్కు దరఖాస్తు చేయడానికి డా. లక్ష్మణరావు సిద్ధమవుతున్నారు. దీనిపైన పెట్టుకొని 50 కిలోల బరువును కూడా పొలానికి తీసుకెళ్లడానికి వీలుందని ఆయన అన్నారు. కేవలం రూ. మూడు నుంచి ఐదు వేల ఖర్చుతో దీన్ని తయారు చేయవచ్చు. దుక్కి దున్నొచ్చు. అంతర సేద్యం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. విత్తనాలు, ఎరువులు వేసుకోవచ్చు. పొగాకు, పత్తి, మిరప, శనగ, కూరగాయల సాగులో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. పెరటి తోటలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సైకిల్ చక్రాలను బిగించడం వల్ల సులభంగా దొర్లుతుంది కాబట్టి మహిళలు కూడా సులువుగా దీనితో వ్యవసాయ పనులు చేయవచ్చు. ఇంటిపట్టున పెరటి తోటల సాగుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
నాలుగు ఎకరాల్లో సేద్యం చేస్తున్నా..
సింగరాయకొండ మండలం కరేడుకు చెందిన రైతు కే వెంకటేశ్వర్లు ఈ పరికరంతో 4 ఎకరాల ఇసుక నేలలో పంటలు పండిస్తున్నారు. వేరుశనగ, జామాయిల్ తదితర నార్ల సాగులో దుక్కి, విత్తనాలు, ఎరువులు వేయడానికి, కలుపు నిర్మూలనకు ఇది ఉపయోగకరంగా ఉందని ఆయన అన్నారు. అరకలు, కూలీల ఖర్చు తగ్గిందన్నారు. మోటారు బిగిస్తే నేలలో పదును ఉన్నప్పుడు నల్లరేగడి, ఎర్రనేలల్లోనూ పైపాటుకు ఈ పరికరాన్ని వాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.
- సీ బీ మోహన్రావు, సాక్షి, ఒంగోలు.
ఫొటోలు: ప్రసాద్
మోటారునూ బిగిస్తున్నాం..!
ఈ పరికరం చిన్న రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మరింత తక్కువ శ్రమతో వ్యవ సాయం చేసుకునేలా మోటారు సైకిల్ ఇంజిన్ను కూడా దీనికి అమర్చుతున్నాం. ఖరీదు మరో రూ. 5 వేలు పెరు గుతుంది. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముందుకొస్తే ఈ పరికరాలను తయారు చేయించి రైతులకు అందు బాటు లోకి తేవాలనుకుంటున్నాం.
- డా. ఎం. లక్ష్మణరావు (98491 40465), ప్రిన్సిపల్, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజి, కందుకూరు, ప్రకాశం జిల్లా
చిన్న రైతుకు చేదోడు
Published Mon, Mar 31 2014 2:12 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement