దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ హత్యకేసులో నిందితుడు, ఢిల్లీ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ శర్మకు 'ఉరి' తప్పింది. అతనికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 1995 జులై 2న తందూరీ రెస్టారెంట్లో తన భార్య నైనా సాహ్నిని తోసివేసి నిప్పు అంటించి హతమార్చిన విషయం తెలిసిందే.
అయితే నైనా సాహ్నిపై ఏర్పడ్డ అనుమానం వల్లే ఈ హత్య జరిగిందని భావించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ... సుశీల్ శర్మ మరణ శిక్షను జీవితఖైదుగా మార్పు చేస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్న తన భార్య నైనా సాహ్ని మరో కాంగ్రెస్ నేత మత్లూబ్ కరీంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడు.
అంతేకాకుండా మత్లూబ్ కరీం.. నైనా ఇద్దరూ కలిసి చదువుకున్న నేపథ్యంలో ....వారు రహస్యంగా వివాహం చేసుకుంటారని భావించిన శర్మ నైనాపై ద్వేషం పెంచుకున్నాడు. జులై 2న ఇంటికి వచ్చిన శర్మ తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా చూశాడు. ఆ తర్వాత ఫోన్ రీడయల్ చేసిన శర్మకు ఆ నెంబరు మత్లూబ్ కరీందిగా తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన శర్మ తన భార్య నైనా సాహ్నిపై తన దగ్గర ఉన్న సైలెంట్ రివాల్వర్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో నైనా అక్కడికక్కడే మృతి చెందింది.
నైనా మృతదేహాన్ని శర్మ, తన స్నేహితుడు, భాగియా రెస్టారెంట్ మేనేజర్ కేశవ్తో కలిసి తందూరి పొయ్యిలో పెట్టి కాల్చివేశారు. అనంతరం హత్యను ప్రమాదవశాత్తూ జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న సుశీల్ శర్మ జులై 11, 1995లో పోలీసులకు లొంగిపోయాడు. 2003లో భార్య హత్య కేసులో మరణశిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టు కూడా మరణశిక్షను ధ్రువీకరించి క్షమాభిక్షను నిరాకరించింది. దాంతో సుశీల్ శర్మ తన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని అతను సుప్రీంను ఆశ్రయంచిన సంగతి తెలిసిందే.
'ఉరి' తప్పింది
Published Tue, Oct 8 2013 3:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement