పూర్వం ఒకసారి భూలోకంలోని ఒక దేశంలో ఎవరూ ఊహించలేనంతటి దుర్భిక్షం ఏర్పడింది. వర్షాలు పడక, తినడానికి తిండిలేక, కొద్దిపాటి ఆహారం కోసమే ఒకరినొకరు చంపుకునేటంతటి కరువది. అలాంటి పరిస్థితులలో ఆ దేశపు రాజుకు కులగురువు ఒక సలహా ఇచ్చాడు. అదేమంటే, వారి కరువు తీర్చడం మామూలు వారి వల్ల అయ్యే పని కాదనీ, కనుక అలకాపురాధీశుడయిన కుబేరుడి సాయం కోరడం మంచిదనీ. దాంతో ఆ రాజు రాజోద్యోగులు, మంత్రులు, పురోహితులు వెంటరాగా, అలకాపురిలో కుబేరుడి నివాసానికి చేరుకున్నాడు. వారు కుబేరుడి వద్దకు వెళ్లిన సమయంలో అక్కడ ధాన్యం నిల్వ ఉండే స్థానం దగ్గర, సాధారణమైన దుస్తులలో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని, మట్టిలో పడిన ధాన్యపు గింజలను ఏరుకుంటున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే కుబేరుడు రాజుగా ఉన్న అలకాపురిలో వారికి ఆ సంఘటన వింతగా అనిపించింది.
మంత్రి ఒకడు అతని వద్దకెళ్లి, ‘‘మహారాజుగారైన కుబేరుడు ఎక్కడ ఉన్నారు?’’అని అడిగాడు. అతను వారిని సాదరంగా లోనికి ఆహ్వానించి, కూర్చొండబెట్టి, తానే కుబేరుడనని తెలియజేసి వచ్చిన పనేమిటో చెప్పమని అడిగాడు. వారు మరింత ఆశ్చర్యపోతూ కించిత్ అసహనంగానే, తామెవరమో, ఎక్కడినుంచి వచ్చామో తెలిపారు కానీ, ఎందుకొచ్చారన్నదీ తెలియజేయకుండానే వెనుదిరగబోయారు... ధాన్యం గాదె వద్ద మట్టిలో పడిన గింజలను ఏరుకునే స్థితిలో ఉన్న ఆ రాజు తమకేమి ఇవ్వగలడన్నదే వారి చిన్నచూపుకు కారణం.
అయితే కుబేరుడు, వారిని మరి కొద్దిసేపు అక్కడే కూర్చోమని వినయంగా చెప్పి, ముందుగా వారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టించి, తర్వాత తన సేవకులను పిలిచి, తన ధాన్యాగారం నుంచి కొన్ని వందల ధాన్యపు బస్తాలు తెప్పించి, బళ్లమీదికి ఎత్తించి, వారిని సాదరంగా సాగనంపాడు. అయితే, అలకాపురి నుంచి వీరి రాజ్యానికి వెళ్లే దారి, తీవ్రమైన ఎగుడుదిగుళ్లతో కూడి ఉండి, ధాన్యపుబళ్లు ప్రయాణించేందుకు ఏమాత్రం యోగ్యంగా లేదు. గుర్రాలపై వీరు వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి కూడా లేదక్కడ. గుట్టలను, మెట్టలను సమం చేసేందుకు కూడా ఆ పరిసర ప్రాంతంలో కొండరాళ్లు తప్ప ఇసుక, మట్టి లేదసలు. ఆ రాళ్లతో గోతులు నింపి, రహదారిని బాగుచేయాలంటే చాలాకాలం పట్టేలా ఉంది.
దాంతో చేసేదేమీ లేక, అలకాపురి నుంచి వీరిని సాగనంపేందుకు వచ్చిన రాజోద్యోగులు ఇదే విషయాన్ని తమ రాజుగారికి వివరించారు. అప్పుడు కుబేరుడు మరిన్ని వందల బస్తాల ధాన్యాన్ని, బళ్లను తెప్పించి, వారితో ముందువెళ్లిన ధాన్యపు సంచులనన్నింటినీ ఆ గోతులలో పోసి, ఎత్తుపల్లాల్ని సరి చేసి, వాటిపై నుంచి ఈ బళ్లను తోలుకెళ్లమని చెప్పాడు. విషయాన్ని తెలుసుకున్న రాజు, అతని మంత్రులు ఉండబట్టలేక కుబేరుడి వద్దకు వెళ్లి, ‘‘స్వామీ! మేము వచ్చిన సమయంలో మీరేమో, మట్టిలో పడ్డ కొద్దిపాటి ధాన్యపు గింజలను కూడా ఏరుకుని భద్రపరుచుకుంటున్నారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని చూసి, మిమ్మల్ని సాయం చేయమనడానికి మనస్కరించక, మేము వెనుదిరగాలనుకున్నాము. మీరు మాకు వందలకొద్దీ ధాన్యపు బస్తాలను ఇచ్చి పంపారు.
బాట సరిగా లేనందువల్ల ఇప్పుడేమో, తిరిగి ఆ ధాన్యపు బస్తాలనన్నింటినీ గోతులలో పోసి పూడ్పించి, తిరిగి రెట్టింపు ధాన్యపు బస్తాల ధాన్యాన్ని ఇచ్చి తీసుకెళ్లమంటున్నారు. ఇందులోని ఆంతర్యం ఏమిటి?’’అని అడిగారు. అందుకు కుబేరుడు నవ్వి, అన్నం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. దానిని ఏమాత్రం అలక్ష్యం చేయరాదు. వృథా చేయరాదు. అలాగే అడిగిన వారికి లేదనకుండా సాయం చేయడం అలకాపురాధిపతిగా నా నియమం. అయితే, మీరు వెళ్లే మార్గం సరిగా లేనందువల్ల ఆ మార్గాన్ని సరి చేసి, మీరు తిరిగి వెళ్లేందుకు బోలెడంత సమయం పడుతుంది. ఈలోగా మీ రాజ్యప్రజలు ఆకలితో మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
ఈ సమయంలో వందలాది మంది ప్రాణాలు నిలపడం ముఖ్యం. అందువల్ల ఆ ధాన్యం బస్తాలను విప్పి, ఎత్తుపల్లాలను సరి చేయమన్నాను. ధాన్యం మూటలతో మీరు మీ రాజ్యానికి వెళ్లిన తర్వాత నేను తిరిగి, ఆ గోతులలో నుంచి ధాన్యాన్ని వెలికి తీసి, ధాన్యాగారానికి రప్పించుకోగలను’’అని సమాధానం చెప్పాడు. ఈ సంఘటనను బట్టి ధనాధ్యక్షుడయిన వారికి సంపదను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అవతలి వారి ప్రాణాలను కాపాడటమూ అంతే ముఖ్యమని అర్థం అవుతుంది. తగువిధంగా ఉపయోగించడమంటే, పిసినారితనంగా ఉండటం కాదని కూడా తెలుస్తుంది.
– డి.వి.ఆర్ భాస్కర్
ధనాధ్యక్షుడి ధనదక్షత
Published Sun, Mar 5 2017 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement