క్యాథలిక్ తెగకు చెందినప్పటికీ, పోప్ వ్యవస్థకు నేటికీ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి ఉంది. క్యాథలిక్ చర్చిలో ఈ వ్యవస్థ పరమ పవిత్రమైనది, అత్యున్నతమైనది. పీటర్ కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఆయనను జీసస్ స్వయంగా నియమించా డని (క్రీ.శ. 493) ప్రతీతి. పోప్ మతపర మైన బిరుదు కాదు. అదొక వ్యవస్థ. ఒక పీఠం. దీనికి రోమ్ ప్రధాన కేంద్రం. పాపల్ కాన్క్లేవ్ వీరిని ప్రత్యేక పద్ధతితో ఎంపిక చేస్తుంది. లాటిన్లోని పాపా (తండ్రి) అనే పదం నుంచే పోప్ పదం వచ్చింది.
క్రీస్తు శకం మొదటి మూడు దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. పోప్ పదవికి వచ్చిన వారికి కొన్ని కీలక చారిత్రక సందర్భాలలో ‘సమస్ పాంటిఫిక్స్’, ‘పాంటిఫిక్స్ మ్యాక్జిమస్’, ‘సెర్వస్ సెర్వోరమ్ డి’ వంటి బిరుదులను ప్రదానం చేయడం కనిపిస్తుంది. ఇన్నివేల సంవత్సరాల కాలంలో ఎందరు పోప్ పదవికి వచ్చా రన్న అంశం మీద చరిత్రకారులలో ఏకాభి ప్రాయం లేదు.
కానీ పోప్ల సంఖ్యను సేకరించిన తొలి చరిత్రకారునిగా హెర్మానస్ కాంట్రాక్టస్కు పేరు ఉంది. ఆయన జాబితాలో మొత్తం 154 మంది పోప్లు ఉన్నారు. ఆఖరి పేరు సెయింట్ పదిహేనో లియో. తరువాత 20వ శతాబ్దం వరకు పోప్ల చరిత్ర, జాబితాలను పునర్ లిఖించుకుంటూనే ఉన్నారు. కేవలం 12 రోజుల నుంచి (ఏడో అర్బన్, క్రీ.శ.1590), మూడున్నర దశాబ్దాల పాటు క్రైస్తవ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఆ పదవిలో ఉన్నవారు కనిపిస్తారు (క్రీ.శ. 752లో సెయింట్ రెండో స్టీఫెన్ ఆ పదవికి ఎంపికైన మూడో రోజునే కన్నుమూశారు.
దీనితో కొందరు చరిత్ర కారులు ఆయన పేరును ఈ జాబితాలో చేర్చరు). సెయింట్ థియోడర్ (క్రీ.శ.897) 20 రోజులు, సెయింట్ వేలంటైన్ (క్రీ.శ. 827) 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం సెయింట్ జోర్గ్ మేరియో బెర్గోగిలియో (పోప్ ఫ్రాన్సిస్) ఉన్నారు.
పోప్లంతా కేవలం ఆధ్యాత్మిక కార్య కలాపాలకే పరిమితం కాలేదు. ఆయా సంక్షోభాల సమయంలో, సమరాల సమయంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన వారున్నారు.
కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు. రెండో జాన్పాల్ (1978-2005) ఇస్లాం, జూడాయిజంలతో, ప్రాచ్య సంప్రదాయ క్రైస్తవంతోను కేథలిక్ తెగ సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేశారు. అలాగే పోలెండ్ దేశస్థుడైన ఈ పోప్ అక్కడ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్టు కూడా గాథలు ఉన్నాయి. 129 దేశాలు తిరిగిన మొదటి పోప్ కూడా ఆయనే. అమెరికాలో పర్యటించిన తొలి పోప్ ఆరో పాల్, సెయింట్ జాన్ అణ్వాయుధాల తగ్గింపు కోసం తన వంతు కృషి చేశారు. సెయింట్ సైయస్ (1922-1939) నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేవారని చెబుతారు.
పోప్ ఒక వ్యవస్థ!
Published Sun, Dec 20 2015 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement