ఒకప్పుడు చనిపోయిన పశువులను ఊరి బయట పడేసేవారు. రాబందులకు అది ఆహారం అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. చనిపోయిన జంతువులను దహనమో, ఖననమో చేస్తున్నారు. దీనివల్ల రాబందులకు ఆహార కొరత ఏర్పడుతోంది. ఒకవేళ ఆహారం దొరికినా రసాయనాల ప్రభావంతో విషపూరితమై అది రాబందుల పాలిటి శాపంగా మారుతోంది. అడవులు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, పారిశ్రామిక కాలుష్యం, రసాయనాల వాడకం... మొదలైన కారణాల వల్ల రాబందులు వేగంగా అంతరించిపోతున్న జాతిలో చేరాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రాబందుల జాతిని సంరక్షించడానికి ప్రభుత్వం, రకరకాల స్వచ్ఛందసంస్థలు కృషి చేస్తున్నాయి.
ఈ ప్రయత్నానికి పౌరులు కూడా తోడైతే రాబందులు మళ్లీ విరివిగా కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు కోయంబత్తూరు(తమిళనాడు)కు చెందిన సుబ్బయ్యభారతిదాసన్.రాబందుల సంరక్షణకు వ్యవస్థాగత కృషితో పాటు వ్యక్తిగత కృషి కూడా కీలకం అని నమ్ముతున్నారు భారతీదాసన్.అరుదైన మొక్కలను సంరక్షించడం కోసం ఒక నర్సరీని నిర్వహించేవారు దాసన్.
ఆ సమయంలోనే రాబందుల దీనస్థితి గురించి విని షాక్కు గురయ్యారు. బాధ నుంచి తేరుకొని రాబందుల సంరక్షణ కోసం కొద్దిమంది మిత్రులతో కలిసి ‘అరులగం’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. రాబందులను సంరక్షించుకోవ డానికి క్షేత్రస్థాయిలో పనిచేయడం ముఖ్యమని నమ్మారు భారతీదాసన్. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్ళి, ఆ గ్రామంలోని పెద్దలు, బడిపిల్లలు, రాజకీయనాయకులు... ఇలా రకరకాల వర్గాలతో మాట్లాడేవారు.
రాబందుల సంరక్షణ అనేది ఎంత ముఖ్యమైన అంశమో వారి అవగాహనలోకి తీసుకువచ్చేవారు. ప్రతి గ్రామంలో ‘వల్చర్ బ్రిగేడ్’ పేరుతో వాలంటీర్లను నియమిస్తున్నారు. అలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36,000 మంది వాలంటీర్లను నియమించారు. గ్రామాలలో స్థానిక కళాకారులతో కలిసి రాబందుల సంరక్షణ గురించి కళా ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ‘ఈ భూమి మీద మనకే కాదు... రాబందులకు కూడా జీవించే హక్కు ఉంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవి మనకు చేసే మేలు విస్మరించలేనిది’ అంటూ ఎలుగెత్తి చాటుతున్న సుబ్బయ్య భారతీదాసన్కు ‘సేవింగ్ వల్చర్స్’ విభాగంలో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయుసిఎన్) అవార్డ్ దక్కింది.
రాబందువు మన బంధువే!
Published Sun, Jun 11 2017 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement