నవంబర్ 1 ప్రపంచ శాకాహార దినోత్సవం
‘తిండి కలిగితె కండగలదోయ్... కండ గలవాడేను మనిషోయ్’ అన్న మహాకవి మాట అక్షర సత్యమే. అయితే, కండబలం పెంచుకోవడానికి మాంసాహారమే తినక్కర్లేదు. శుభ్రంగా శుద్ధ శాకాహారాన్ని సంతుష్టిగా తింటూ పుష్టిగా కండబలానికి లోటు లేకుండా బతకవచ్చని నిరూపిస్తున్న శాకాహారుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడే పాశ్చాత్య దేశాల్లో సైతం గడచిన దశాబ్ద కాలంగా శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
పెరుగుతున్న శాకాహారులు
హిందువులు, బౌద్ధులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎక్కువగానే ఉంటోంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మాత్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ, పర్యావరణ స్పృహ పెరగడమే ఈ పరిణామానికి కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ‘పెటా’ వంటి సంస్థల ప్రచారం వల్ల జంతువులపై హింసను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది.
మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి యూరోపియన్ దేశాల్లో గడచిన దశాబ్ద కాలంలో వెజిటేరియన్ రెస్టారెంట్ల సంఖ్య రెట్టింపు కావడమే దీనికి నిదర్శనం. తాజా అంచనాల ప్రకారం బ్రిటన్లో దాదాపు 12 శాతం, స్వీడన్లో సుమారు 10 శాతం, ఇజ్రాయెల్లో, అమెరికాలో దాదాపు 4 శాతం ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లో ఎక్కువగా యువతరం జనాభా క్రమంగా మాంసాహారానికి దూరమవుతుండటం విశేషం.
మాంసాహారంతో పర్యావరణ సమస్యలు
మాంసాహారం వల్ల పర్యావరణానికి చాలా సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాంసాహారం పరోక్షంగా నీటి ఎద్దడికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక కిలో మాంసం వినియోగదారుడికి అందాలంటే దాదాపు 15,500 లీటర్ల నీరు అవసరమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 70 శాతం మంచినీరు మాంసాహారానికి ఉపయోగపడే జంతువుల కోసం పచ్చిక పెంచడానికే సరిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) హెచ్చరిస్తోంది. బహుశ ఈ హెచ్చరికలు కూడా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల జనాభా పెరగడానికి దోహదపడి ఉంటాయని భావిస్తున్నారు.
శాకాహారమూ బలవర్ధకమే
ఆకులు అలములు, కాయలు పండ్లతో కూడిన శాకాహారంలో ఎలాంటి బలం ఉండదనేది అపోహ మాత్రమేనని పలు పరిశోధనలు ఇప్పటికే రుజువు చేశాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా గింజలు, పప్పుధాన్యాలు తీసుకున్నట్లయితే పుష్కలంగా శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. పశుసంపద నుంచి సేకరించే పాలకు బదులుగా సోయా పాలు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించే శుద్ధ శాకాహారులు సైతం నిక్షేపంగా బతుకుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసం సహా ఇతర జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా శుద్ధ శాకాహారం తీసుకుంటూ జీవించినా ఆరోగ్యానికి ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. శాకాహారం వల్ల శరీర దారుఢ్యానికి ఎలాంటి లోటు ఉండదని పలువురు క్రీడాకారులు తాము సాధించిన విజయాలతో ఇప్పటికే ప్రపంచం కళ్లు తెరిపించారు. జర్మన్ వెయిట్ లిఫ్టర్ పాట్రిక్ బాబోమియాన్, ఆస్ట్రేలియన్ బాడీబిల్డర్ బిల్లీ సిమ్మండ్స్ తదితరులు శుద్ధ శాకాహారులే.
శాకం శరణం గచ్ఛామి
Published Sun, Oct 30 2016 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement