టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Fri, Nov 6 2015 11:45 AM

10th class student suspicious death in hyderabad

అత్తాపూర్: పాఠశాలకు వెళ్లిన విద్యార్థి అనుమానస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో జరిగింది.  వివరాలు..అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్‌లో నివాసముంటున్న అమీర్(15) స్థానిక జోసెఫ్ షైన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. హుటాహుటిన స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది.

అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. స్కూల్లో ఆడుకుంటూ కింద పడి మృతిచెందాడని ఉపాధ్యాయులు చెప్తుండగా, వైద్యులు మాత్రం ఛాతీపై బలంగా గుద్దడంతోనే ఈ ఘటన జరిగినట్లు అంటున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement