బొలెరో బోల్తా.. 16 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

బొలెరో బోల్తా.. 16 మందికి గాయాలు

Published Mon, Mar 28 2016 12:13 PM

16 injured in road accident at kurnool district

సి.బెళగల్: కర్నూలు జిల్లా సి.బెళగల్ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. 16 మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి లారీలో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ సిబెళగల్ మండలం కె.సింగవరం గ్రామానికి చెందిన వారు. ఎమ్మిగనూరు మండలం కల్లుగట్ల గ్రామంలో వివాహ నిశ్చితార్థానికి వెళతుండగా ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement