'హోదా' కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం | Sakshi
Sakshi News home page

'హోదా' కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం

Published Sun, Aug 9 2015 1:59 PM

'హోదా' కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం - Sakshi

హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చి మోసం చేస్తున్నదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం లేనేలేదని బీజేపీ పేర్కొనడం దారుణమన్నారు.

ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నదన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం మునికోటి మరణం దిగ్భ్రాంతి కలిగించిదన్నారు. కోటి కుటుంబ సభ్యులకు రఘువీరా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ప్రజలెవరూ ప్రాణ త్యాగాలకు పాల్పడవద్దన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement