రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

Published Sat, Aug 26 2017 1:50 PM

bike accident in bhadradri distrct

భద్రాద్రి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటన జిల్లాలోని అశ్వరావుపూట మండలం ఆసుపాక గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. కుక్కనూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు ద్విచక్రవాహనంపై కొత్తగూడెం వెళ్లుండగా బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వర్ధన్(30) మృతి చెందాడు. అనతి తల్లికి తీవ్ర గాయాలు కావడంతో గుర్తించిన వాహనదారులు ఆమెను అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement