విద్యుధ్ఘాతానికి అన్నదమ్ములు బలి | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతానికి అన్నదమ్ములు బలి

Published Sun, Feb 7 2016 12:18 PM

Brothers  die of electric shock

వ్యవసాయ బావిలో నుంచి చెడిపోయిన మోటర్ తీయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కుందుప్రి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న(41), నాగన్న(35)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వ్యవసాయ బావిలో ఉన్న మోటర్ చె డిపోవడంతో.. దాన్ని బాగు చేయించడానికి బయటకు తీసే ప్రయత్నంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు ఇనుప పైపులు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement