‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు
* ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రోడ్డు భద్రతా బిల్లు తెస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటేటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాద మరణాలపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే రోడ్డు రవాణా భద్రత బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత వైద్యం అందజేస్తామని వెల్లడించారు. ఆదివారం రేడియోలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ ఈ మేరకు తెలిపారు.
అనేక సామాజికాంశాలపై మాట్లాడిన మోదీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభనపై మాత్రం స్పందించలేదు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో ఏయే అంశాలపై మాట్లాడాలో సూచించాలని ప్రజలను కోరారు. ఇటీవల ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో ఓ బాధితుడు నెత్తురోడుతూ పడిపోయినా ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారని, ఈ ఘటన తర్వాత ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పూనుకోవాలంటూ తనను అనేక మంది కోరారన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు
♦ దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. మృతుల్లో మూడోవంతు 15 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారే.
♦ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా బిల్లు తీసుకురావడంతోపాటు జాతీయ రోడ్డు భద్రతా విధానం, రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు చేపడతాం. ఈ కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తొలి 50 గంటలలోపు నగదుతో పనిలేకుండా చికిత్స అందిస్తాం.
♦ దేశవ్యాప్తంగా ప్రమాదాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి టోల్ఫ్రీ నంబర్ 1033తోపాటు అంబులెన్సు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
♦ రైల్వే ఐఆర్సీటీసీలో టికెట్లు తీసుకోడానికి వికలాంగులకు కోటా పెట్టాలని కాన్పూర్కు చెందిన అఖిలేష్ వాజపేయి చేసిన సూచన మేరకు ఆ విధానాన్ని అమలు చేశాం.
కార్గిల్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా...
కార్గిల్ యుద్ధ అమరవీరులకు మోదీ ‘మన్కీ బాత్’లో, ట్విటర్లో నివాళులు అర్పించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. భారత సాయుధ దళాల శౌర్యానికి, త్యాగానికి ఈయుద్ధం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయంలో దేశంలోని ప్రతి గ్రామం, నగరం వంతు పాత్ర ఉందని ఉద్ఘాటించారు.
ఈ యుద్ధం కేవలం సరిహద్దులో జరిగిన పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో దేశంలోని ప్రతి ఒక్క గ్రామం, ఒక్క నగరం కూడా తమ వంతు పాత్రను నిర్వహించాయని అన్నారు. కార్గిల్లో మన ఒక్కో సైనికుడు వంద మంది శత్రు సైనికులకు సమానమని నిరూపించారని ఆయన కొనియాడారు.
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స
Published Mon, Jul 27 2015 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
Advertisement