Sakshi News home page

కేంద్రం కోరడం సిగ్గుచేటు: జీవన్‌రెడ్డి

Published Mon, Nov 23 2015 12:41 PM

drought zones in telangana

రాయికల్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం సిగ్గు చేటని శాసనసభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా రాయికల్‌లో మీడియాతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించమని రాష్ట్రాన్ని కేంద్రం కోరడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్రం కోల్పోవలసి వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ వెంటనే కరువు మండలాలను ప్రకటించి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement