మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం మస్కతి మృతి | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం మస్కతి మృతి

Published Tue, Aug 25 2015 2:45 AM

మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం మస్కతి మృతి - Sakshi

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి(85) సోమవారం ఉదయం స్వగృహంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మస్కతి మృతి విష యం తెలిసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మజ్లీస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ అల్తాఫ్ రజ్వీ, ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, అహ్మద్ బలాలతోపాటు పలువురు ప్రముఖులు ఆయన స్వగృహమైన పాతబస్తీ కోట్లా ఆలిజాకు చేరుకొని పార్థివదేహానికి నివాళులర్పించారు. సాయంత్రం మక్కామసీదులో ప్రార్థనల తర్వాత కం చన్‌బాగ్‌లోని అల్లానుమా ఖుదానుమా దర్గా వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.
 
సీనియర్ నాయకున్ని కోల్పోయాం: చంద్రబాబు
ఇబ్రహీం మస్కతి మృతితో టీడీపీ సీనియర్ మైనారిటీ నాయకుణ్ణి కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ టీడీపీ ఉపాధ్యక్షుడు అలీ మస్కతీతోపాటు ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. కాగా, ఇబ్రహీం మస్కతి మృతిపట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement