* గోదావరి తీరాన మూడోరోజూ పుష్కర శోభ
* తెలంగాణ పుణ్యస్నానాలు ఆచరించిన లక్షలాది మంది భక్తులు
* భద్రాచలానికి 1.70 లక్షలు, ధర్మపురికి 75 వేల మంది రాక
సాక్షి నెట్వర్క్: మహా పుష్కరాల మూడోరోజూ గోదావరి తీరం జనంతో పోటెత్తింది. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే అమావాస్య కావడంతో గత రెండ్రోజులతో పోలిస్తే గురువారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది.
రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలైన బాసర, ధర్మపురి, కాళేశ్వరంలో మంగళ, బుధవారాలతో పోలిస్తే గురువారం తక్కువ సంఖ్యలో పుష్కర స్నానం ఆచరించారు. ధర్మపురిలో 75 వేలు, కాళేశ్వరంలో 75 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. బాసర, భద్రాచలం ప్రాంతాల్లో మాత్రం భక్తుల రద్దీ ఎప్పట్లాగే కొనసాగింది. భద్రాచలంలో 1.70 లక్షలు, బాసరలో 45 వేల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. అధిక ఆషాఢ మాసం చివరిరోజు అమావాస్య పునర్వసు పుష్యమి ఘడియలు రావడంతో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు సమర్పిస్తే వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయని భక్తుల వి శ్వాసం.
దీంతో త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో భక్తుల సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ ఇక్కడ పుష్కర స్నానాలు, పిండ ప్రదానాలు అంతగా జరగలేదు. మధ్యాహ్నం వరకు 75 వేల మంది భక్తులు మాత్రమే పుష్కర స్నానాలు ఆచరించారు. మొత్తమ్మీద గురువారం దాదాపు 8 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. క్షేత్రాలకు మూడోరోజూ ప్రముఖుల తాకిడి కొనసాగింది. కాళేశ్వరంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ పుష్కర స్నానం ఆచరించారు.
ధర్మపురిలో సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్చైర్మన్ నిరంజన్రెడ్డి పుష్కర స్నానాలు చేశారు. భద్రాచలం ఘాట్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్రెడ్డి తదితరులు స్నానం ఆచరించారు. వీహెచ్పీ జాతీయాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఖమ్మం జిల్లా కొండాయిగూడెం పుష్కరఘాట్ వద్ద శివలింగ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. మణుగూరు మండలం చిన్నరావిగూడెంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పుష్కరస్నానం ఆచరించి పిండ ప్రదానం నిర్వహించారు.
పోటెత్తిన భక్తజనం
Published Fri, Jul 17 2015 3:26 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement