భార్యను కత్తితో నరికిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను కత్తితో నరికిన భర్త

Published Tue, Mar 1 2016 6:57 PM

HE cut down his Wife with a knife

అదనపు కట్నం తేవాలంటూ భార్యపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన నాగాయలంక మండలం కమ్మలమూల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆర్యవరపు శ్రీనివాస్(30), లక్ష్మీ నాంచారమ్మ(25)కు నాలుగేళ్ల క్రితం వివాహమయ్యింది. పెళ్లి సమయంలో ఒకటిన్నర ఎకరా భూమిని కట్నంగా ఇవ్వగా, మరో అరఎకరం తేవాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశానికి గురైన శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు గాయపడిన నాంచారమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

 

Advertisement
Advertisement