దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత

Published Tue, Jan 19 2016 9:24 AM

దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్మ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో రాంనగర్ లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

రోహిత్ ఆత్మహత్మ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జాగృతి దత్తాత్రేయ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జాగృతి కార్యకర్తలు, ఆందోళన కారులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు తరలి వచ్చారు.  మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ కి వ్యకతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన ఎక్కువకావడంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   

 

Advertisement
Advertisement