తాడిమర్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ (70) అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్పల్లి గ్రామం. గోవిందమ్మ అనారోగ్యంతో రెండు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా గోవిందమ్మ భౌతికగాయాన్ని నార్సింగ్ పల్లికి తరలించనున్నారు. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.
Breadcrumb
డీజీపీ జేవీ రాముడికి మాతృవియోగం
Published Sat, Sep 26 2015 8:18 AM
Related news
-
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్లు నిర్వహించగా... తొలి గేమ్ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్లో, విదిత్ 28వ ర్యాంక్లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్లో, వైశాలి 13వ ర్యాంక్లో ఉన్నారు. -
హైదరాబాద్లోనే కోల్కత్తా కాళీ మందిర్.. స్వర్ణశిల్పి టెంపుల్ ప్రత్యేక (ఫొటోలు)
-
తెలంగాణలో భానుడి భగభగలు..!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్లో 47.6, అబ్దుల్లాపూర్మెట్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు. ఆల్కహాల్తోనూ డీ హైడ్రేషన్.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. వడదెబ్బ లక్షణాలివీ.. వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు. -
Dr Evita Fernandez: సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యం...
‘‘ప్రసవం స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఆ మరుజన్మ ఆమెకు ఎంతో ఆనందకరమైన అనుభూతిగా జీవితాంతం మిగిలి΄ోవాలి. అందుకోసమే నా కృషి’ అన్నారుహైదరాబాద్లోని ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ చెయిర్పర్సన్, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్. ప్రసవ సమయంలో కీలకమైన మంత్రసానుల ఆవశ్యకతను గుర్తించి చేపట్టిన శిక్షణా కార్యక్రమాలతో ΄ాటు గర్భిణులకు ప్రీ చైల్డ్ బర్త్ అవేర్నెస్ క్లాసులను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మిడ్వైఫరీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ఈ డాక్టర్ 2011లో తెలంగాణలో మొట్టమొదటి ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ సర్వీసెస్ ్ర΄ారంభించారు. మే5 ‘ఇంటర్నేషనల్ మిడ్వైఫ్ డే..’ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎవిటాను కలిసినప్పుడు మాతాశిశు సంరక్షణలో మంత్రసానుల కీలక ΄ాత్ర, గర్భిణులకు అవగాహన కలిగించే ఎన్నో విషయాలను తెలియజేశారు. ‘‘సాధారణ ప్రసవాలను ్ర΄ోత్సహించాలి. అవసరం లేని సిజేరియన్స్ శాతాన్ని తగ్గించాలి. మాతా, శిశు సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఐదేళ్లలో సిజేరియన్ల శాతం బాగా తగ్గించగలిగాం. దీనికి గర్భిణుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. మహిళలు తమ శరీరం గురించి అర్ధం చేసుకుని, భయాలు తొలగి΄ోయేలా, ప్రసవానికి సంబంధించి వీలైనంత అవగాహన పెంచుకుంటే ఒత్తిడిని తగ్గించుకొని ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి ప్రసవం గౌరవప్రదంగా, ఆనందకరమైన అనుభవంగా మారాలి. అందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడూ చేస్తుంటాం.ప్రసూతి సేవలకు వెన్నెముకమంత్రసాని వ్యవస్థ స్త్రీ చుట్టూ, స్త్రీల కోసం కేంద్రీకృతమైంది. గర్భవతికి మద్దతు, గోప్యత, విశ్వాసం కలిగిస్తుంది. 2007 నాటికి ఏడాదికి 5వేలకు పైగా డెలివరీ చేసేవాళ్లం. ఎంతోమంది గర్భిణులు ముఖ్యంగా చిన్నవయసు వారిలో ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు నన్ను బాగా కలిచి వేసేవి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల గురించి చదవడం, తెలుసుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పటిదాకా మేం అనుసరించిన ప్రసవ పద్ధతుల్లో మార్పులు అవసరం అని గ్రహించాను. ఈ క్రమంలో ప్రసూతి మరణాల రేటు తక్కువ ఉన్న దేశాలు మిడ్వైఫరీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిసింది. అయితే, మన దేశంలో ఆ వెసులుబాటు లేదు. ఒకప్పుడు గ్రామాల్లో ఒక అనుభవం ఉన్న మంత్రసాని ఉండేది. తల్లిలా చూసుకునే అనుభవజ్ఞురాలైన మంత్రసాని దేశంలోని అన్ని ఆసుపత్రులలో ఉండటం అత్యవసరం అనిపించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలకు అత్యున్నత స్థాయి గల ప్రసూతి సంరక్షణ అవకాశాన్ని కలిగించవచ్చని అనిపించింది. అలాగే, అనవసరమైన సిజేరియన్లు తగ్గించడానికి కూడా ఈ ప్రక్రియ ఎంతగానో దోహపడుతుంది.తెలంగాణలో..ఈ ఆలోచన చేసిన వెంటనే వెనకడుగు వేయకుండా 2011లో రెండేళ్ల అంతర్గత ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పిఎమ్ఇటి) ్ర΄ోగ్రామ్ను ్ర΄ారంభించాం. మొదట పైలట్ ్ర΄ాజెక్ట్ పూర్తి చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి హెల్త్కేర్ ఎకో సిస్టమ్లో మంత్రసానుల ప్రవేశం మొదలైంది. 2018లో ఫెర్నాండేజ్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి నర్సుల కోసం మిడ్వైఫరీలో 18 నెలల సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ్ర΄ారంభించాం. మిడ్వైఫ్స్ కోసం రూ΄÷ందించిన ఈ కోర్సు తెలంగాణలోనే మొట్టమొదటిది. మొదట తెలంగాణలోని పది మారుమూల ఆసుపత్రుల్లో 30 మంది నర్సులకు మిడ్వైఫరీలో శిక్షణ ఇవ్వడం, ప్రసూతి సంరక్షణలో గేమ్ ఛేంజర్గా నిరూపించబడింది. ఇప్పుడు తెలంగాణలో సహజ ప్రసవాల శాతం పెరుగుతుంది. ఈ పని ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది.ఆంధ్రప్రదేశ్లో..ఇటీవలే పీఎమ్టీ ్ర΄ోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లోనూ ్ర΄ారంభించాం. యునిసెఫ్, డబ్ల్యూహెచ్వో, బర్మింగ్హమ్ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మొదటగా తెనాలిలో ఈ ్ర΄ాజెక్ట్ పూర్తయ్యింది. తర్వాత సి–సేఫ్ ్ర΄ాజెక్ట్స్ జిజిహెచ్ రాజమహేంద్రవరం, జిజిహెచ్ ఏలూరు, జిజిహెచ్ మచిలీపట్నం, డిహెచ్ అనకాలపల్లిలో చేయబోతున్నాం.విస్తరణ వైపుగా... నవాబుల కాలంలో హైదరాబాద్లో మా అమ్మ నాన్నలు లెస్లీ, లౌర్డెస్ ఫెర్నాంyð జ్లు రెండు పడకలతో ఫెర్నాండెజ్ ఆసుపత్రిని ్ర΄ారంభించారు. ఆ రోజుల్లో మాతా, శిశు మరణాలను చూసి వాటిని అడ్డుకోవాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఆ తర్వాత నేను బాధ్యతలు తీసుకునే నాటికి 30 పడకలకు పెరగింది. స్త్రీ వైద్య నిపుణురాలిగా, నిర్వాహకురాలిగా నా బాధ్యతలను విస్తరిస్తూ వస్తున్నాను. ఫలితంగా ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ నేడు 300 పడకల సామర్థ్యంతో మూడు ఆసుపత్రులు, రెండు ఔట్ పేషెంట్ క్లినిక్లు, నర్సింగ్ స్కూల్కి పెరిగింది. ఈ క్రమంలో వారి ఆశయాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి జరిగింది. మాతా, శిశు సంరక్షణపై దృష్టి సారించి వారి ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వైపుగానూ విస్తరించింది’’ అని వివరించారు. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోర్ల అనీల్కుమార్ -
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్ఫాం ఎయిర్బీఎన్బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్తో చేతులు కలిపింది. ’భారత్లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్లా జీవించండి’ స్లోగన్తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్బీఎన్బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు.
Related News by category
-
జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు..
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం కింద ఉరవకొండ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండ పర్యటన సందర్భంగా ఆయకట్టు అభివృద్ధికి ఆమోదం తెలిపారు. హంద్రీనీవా 33వ ప్యాకేజీ కింద 20,600 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు, 36(ఏ) ప్యాకేజీ కింద 65,600 ఎకరాలు మొత్తంగా 76,058 ఎకరాలకు సంబంధించి ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణానికి 68.45 కోట్లు మంజురు చేశారు. దీంతో పాటు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న జీడిపల్లి గ్రామాన్ని పునరావసం కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశారు. హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు
● కృష్ణాజలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం ● గతంలో ఎటు చూసినా బీడు భూములే ● నేడు పచ్చని పంటలతో కళకళ ● భారీగా పెరిగిన భూగర్భజలాలు ● సీఎం వైఎస్ జగన్ హమీతో 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ● జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకూ పునరావాసం ● ఉరవకొండ మండలంలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిళం ఉంది. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. ● కూడేరు మండలంలో పీఏబీఆర్(పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఉంది. ఇది పర్యాటక ప్రాంతంతో పాటు జలవిద్యుత్ తయారీ కేంద్రంగా ఉంది. ● బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ జిల్లాకు ఆయువుపట్టు లాంటింది. హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ● ఉరవకొండ మండలం బూదగవిలో రాష్ట్రంలోనే రెండోదిగా ప్రసిద్ధిగాంచిన సూర్యదేవాలయం ఉంది. ● కూడేరులో ప్రసిద్ధిగాంచిన జోడులింగాల సంగమేశ్వర ఆలయం కొలువుదీరింది. నీటితో కళకళ లాడుతున్న జీడిపల్లి రిజర్వాయర్ ఉరవకొండ: నియోజకవర్గంలో జల సిరులు సవ్వడి చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా కరువును పాలదోలడానికి జలయజ్ఞంలో భాగంగా హంద్రీ–నీవాకు అంకుర్పారణ చేయగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయకట్టు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో కృష్ణాజలాలు పరుగులుడితున్నాయి. ఒకవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నీటితో రైతులు విస్తుృతంగా పంటలు సాగు చేస్తున్నారు. నియోజకవర్గ విశిష్టత.. ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా కేంద్రానికి వాయువ్యదిశలో 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1808లో దత్త మండలాల్లో ఉరవకొండ ఒకటిగా ఉండేది. 1882లో అనంతపురం జిల్లాలో భాగమైంది. 1988 నుంచి గ్రామ పంచాయతీ బోర్డుగా ఎర్పడి స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టింది. 1985 మే 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో కణేకల్లు సబ్డివిజన్ తాలుకాలోని కొన్ని గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. ఉరవకొండ చుట్టూ కొండ ఉండటం వల్ల ఆకొండ పాము పడగ ఆకారంలో ఉండటం వల్ల ఉరగాద్రిగా పిలవబడే ఈ ప్రాంతం ఉరవకొండగా మారిపోయింది. నియోజకవర్గ స్వరూపం.. ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో నియోజకవర్గంలో ఉన్న కణేకల్లు, పామిడి, గుంతకల్లు మండలాల్లోని కొన్ని గ్రామాలు పూర్తిగా ఆయా మండలాల్లోకే వెళ్లాయి. కొత్తగా కూడేరు, బెళుగుప్ప మండలాలు నియోజకవర్గంలోకి చేరాయి. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి ఉత్తరాన వజ్రకరూరు మండలం, దక్షిణాన బెళుగుప్ప మండలం, తూర్పున కణేకల్లు, బొమ్మనహాళ్, పడమర కూడేరు మండలాలున్నాయి. ఉరవకొండకు కేవలం 17 కిలోమీటర్ల దూరం( విడపనకల్లు మండలం) దాటగానే కర్ణాటక సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. దీంతో పలు గ్రామాల్లో కన్నడ ప్రభావం అధికంగా ఉంది. పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉన్నప్పటికీ వ్యవహారికంలో ఇప్పటికీ కన్నడ భాషను వాడుతున్నారు. రాజకీయ పోరు.. రాజకీయ ఉద్ధండులకు నిలయమైన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి విలక్షణ తీర్పును వెలువరిస్తూ వస్తున్నారు. ఉరవకొండలో ఒక పార్టీ నుంచి అభ్యర్థి గెలిస్తే ఇంకొక పార్టీ అధికారం చేపట్టే సెంటిమెంట్ కొనసాగుతోంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఆరుసార్లు టీడీపీ గెలుపొందగా, నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైఎస్సార్సీపీ విజయం సాధించాయి. 1962లో గుర్రం చిన్నవెంకన్న(ఇండిపెండెంట్) 1967లో గుర్రం చిన్నవెంకన్న(నేషనల్ కాంగ్రెస్) 1972లో బుక్కిట్ల బసప్ప(కాంగ్రెస్) 1978లో రాయల వేమన్న(కాంగ్రెస్) 1983లో వై.భీమిరెడ్డి(టీడీపీ), 1985లో గుర్రం నారాయణప్ప(టీడీపీ) 1989లో గోపినాథ్(కాంగ్రెస్) 1994లో పయ్యావులకేశవ్(టీడీపీ) 1999లో వై.శివరామిరెడ్డి(కాంగ్రెస్) 2004లో పయ్యావుల కేశవ్(టీడీపీ) 2009లో పయ్యావులకేశవ్(టీడీపీ) 2014లో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్సీపీ) 2019లో పయ్యావుల కేశవ్ (టీడీపీ) గెలుపొందారు. నియోజకవర్గ ప్రత్యేకతలు.. నియోజకవర్గ సమాచారంఉరవకొండ బరిలో 11 మంది అభ్యర్థులు ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలో 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో నలుగురు ఇండిపెండింట్ అభ్యర్థులు ఉన్నారు. బరిలో ఉన్న వారిలో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్సీపీ), పయ్యావుల కేశవ్ (టీడీపీ), వై.మధుసూదన్రెడ్డి (కాంగ్రెస్), అంకే తిప్పేస్వామి (బీఎస్పీ), కురుబ చిన్నక్క (ఆలిండియా కిసాన్ జనతా పార్టీ), బెస్త పవన్కుమార్ (భారతీయ చైతన్య యువజన పార్టీ)తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మోహన్దాస్, బి.చంద్రశేఖర్రెడ్డి, కె.దామోదర్రెడ్డి, విశ్వేశ్వరయ్యస్వామి ఉన్నారు. -
‘విశ్వ’ వచ్చినప్పుడు ఉన్నారో అంతు చూస్తాం!
● ‘కౌకుంట్ల’వాసులకు పెత్తందారుల బెదిరింపులు ● ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోండంటూ హుకుం ● వచ్చేది తమ ప్రభుత్వమే.. మాట వినలేదో అంతే సంగతులంటూ హెచ్చరికలు ● రెండు రోజుల క్రితం ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ● అప్రజాస్వామిక శక్తుల ఆగడాలపై ఈసీకి ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వ ఫిర్యాదు ఉరవకొండ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ అభ్యర్థి బలం ముందు దరిదాపుల్లో కూడా నిలవలేమని పెత్తందారులు గ్రహించేశారు. గత ఎన్నికల తరహాలోనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ను ఏకపక్షంగా నిర్వహించుకోవాలని బరితెగించేశారు. ఆ క్రమంలోనే గ్రామస్తులపై సంఘ విద్రోహ శక్తులను ఉసిగొల్పారు. దీంతో భయకంపితులైన ఆయా పల్లెల ప్రజలు రోజంతా ఊరు విడిచి పొలాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వివరాలు.. ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల పంచాయతీ పరిధిలో ఈ నెల 2న ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ముందు రోజే ప్రకటించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న పెత్తందారులు కంగారెత్తిపోయారు. పంచాయతీలో ‘విశ్వ’ ప్రచారం చేస్తే తాము ఉనికి కోల్పోతామని గ్రహించి ఆందోళనకు గురయ్యారు. తాము పెంచి పోషించే సంఘ విద్రోహ శక్తులను రాత్రికి రాత్రే పంచాయతీ పరిధిలోని మైలారంపల్లి, రాచేపల్లి, వై.రాంపురం, కౌకుంట్ల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ పంపి ప్రజలను బెదిరింపులకు గురి చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లకపోతే అంతు చూస్తామంటూ హడలెత్తించారు. వచ్చేది తమ ప్రభుత్వమే.. మాట వినలేదో అంతే సంగతి అంటూ హల్చల్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన ఆయా గ్రామాలవాసులు బతుకు జీవుడా అంటూ ఊర్లు విడిచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ఇంతే.. సామాన్యులు ఒక్కరూ ఓటు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కౌకుంట్ల పంచాయతీలో ఏకపక్షంగా ఓటింగ్ నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ఆ పంచాయతీకి చెందిన పెత్తందార్ల సారథ్యంలో ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే, విశ్వేశ్వరరెడ్డి కొన్నేళ్లుగా పోరాటాలు సాగిస్తూ ఆయా పల్లెవాసుల్లో చైతన్యం తీసుకొచ్చారు. దీంతో చాలా మార్పు వచ్చింది. నిర్భయంగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇవన్నీ ఓర్వలేని పెత్తందార్లు పాత సంస్కృతికి తెరతీయడం గమనార్హం. ఈసీకి ఫిర్యాదు.. కౌకుంట్ల పంచాయతీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న తీరుపై విశ్వేశ్వర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందారుల ఆగడాలపై ఆధారసహితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీపై రౌడీషీటర్లు,గూండాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
● సిబ్బందికి కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్లో (డీసీసీసీ) పనిచేసే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ అమిత్ బర్దర్తో కలిసి కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్ యూనిట్ నుంచి జిల్లాలో చెక్పోస్టుల వద్ద లైవ్ స్ట్రీమింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. వెబ్కాస్టింగ్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. చెక్పోస్టుల వద్ద లైవ్ స్ట్రీమింగ్, ఎఫ్ఎస్టీ వాహనాల లైవ్ స్ట్రీమింగ్, జీపీఎస్ ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రాత్రి సమయంలో లైవ్ స్ట్రీమింగ్ బాగా జరుగుతోందా...? ఏవైనా సమస్యలు ఉన్నాయా..? అంటూ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. జగన్ పాటకే భయపడ్డారు! ● హిందూపురంలో టీడీపీకి ఓటమి భయం ● వైఎస్ జగన్ పాటలు పెట్టారంటూ పచ్చ నేతల గొడవ ● వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి.. ముగ్గురికి గాయాలు హిందూపురం అర్బన్: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్ జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్రెడ్డి, నవీన్, బాబు, అసీఫ్లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్తో పాటు బాబు, నవీన్లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు. -
అన్న చేతిలో తమ్ముడు హతం
గుంతకల్లు రూరల్: చిన్నపాటి విషయానికి చోటు చేసుకున్న గొడవలో చివరకు అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పుట్టుకతోనే చెవుడు, మూగ కావడంతో పెద్ద కుమారుడు నారాయణరెడ్డికి తల్లిదండ్రులు వివాహం చేయలేకపోయారు. మరో కుమారుడు రామకృష్ణారెడ్డికి గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. కుమార్తె బాలమ్మకు సొంతూరిలోనే పెద్దిరెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని రోజులుగా అన్నదమ్ములిద్దరూ మద్యానికి బానిసలయ్యారు. భర్త రామకృష్ణారెడ్డి ప్రవర్తనతో విసుగు చెందిన శ్రీవాణి ఇటీవల అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం నారాయణరెడ్డి, తన బావ పెద్దిరెడ్డితో కలసి ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. కాసేపటి తర్వాత మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సమయంలో వండిన ఆహారాన్ని నారాయణరెడ్డి బయట పడేసి వెళ్లిపోయాడు. ఈ విసయాన్ని బామ్మర్ది రామకృష్ణారెడ్డితో చెప్పి పెద్దిరెడ్డి బాధపడ్డాడు. దీంతో రామకృష్ణారెడ్డి తన అన్నను మందలిస్తూ చేయి చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న నారాయణరెడ్డి మంచంపై నిద్రిస్తున్న రామకృష్ణారెడ్డిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్ ఎస్ఐ సురేష్ శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం మల్కాపురం (విశాఖ జిల్లా): శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మెడికో మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు ఇలా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన షేక్జానీ(19), అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యకుమార్, శ్రీకాకుళానికి చెందిన ప్రమోద్లు కొమ్మదిలోని గాయత్రి మెడికల్ కళాశాలలో మెడిసిన్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ ముగ్గురు ఒకే ద్విచక్రవాహనంపై యారాడ, గంగవరం బీచ్కు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరారు. మల్కాపురం పోలీసు స్టేషన్ రోడ్డు నుంచి సింథియా వైపు వెళుతుండగా షిప్యార్డ్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షేక్జానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సత్యకుమార్, ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో డివైడర్ పనులు జరుగుతున్నాయి. తవ్విన వ్యర్థాలను తరలించేందుకు అక్కడ ట్రాక్టర్ వచ్చింది. ఇది గుర్తించలేని యువకులు ట్రాక్టర్ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్లో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. విచారణ జరుపుతున్నామని మల్కాపురం ఇన్చార్జ్ సీఐ దాశరథి చెప్పారు. రెచ్చిపోయిన టీడీపీ అల్లరిమూక ●యల్లనూరు: శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అల్లరిమూక రెచ్చిపోయింది. దీంతో ప్రశాంతంగా ఉన్న యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలు... శుక్రవారం ఉదయం గొడ్డుమర్రిలో శ్రావణి ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తీసేసి హల్చల్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గిరిబాబు, సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిటీ సభ్యుల నియామకంఅనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన నాయకులను ఎన్నికల కమిటీ సభ్యులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నియమితులైన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిద్దె కుళ్లాయప్ప(శింగనమల), రాష్ట్ర కార్యదర్శిగా గౌస్ బేగ్(అనంతపురం), విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరువీధుల లోకేష్కుమార్ (అనంతపురం), విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎద్దుల నవీన్కుమార్ రెడ్డి (ఉరవకొండ), అనంతపురం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా గుజ్జల పోతులయ్య (అనంతపురం), జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా లబ్బే రాఘవ (అనంతపురం), జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పల్లె వినోద్కుమార్రెడ్డి (తాడిపత్రి), అనంతపురం నగర కార్యదర్శిగా యు.లోక్నాథరెడ్డి, నగర కార్యదర్శిగా బి. రామమోహన్ రెడ్డి ఉన్నారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement