నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Published Sun, Jan 10 2016 12:24 PM

Man dies as Auto overturns

వెల్దుర్తి (గుంటూరు) : చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆటో నడుపుతూ గుట్కా తినడానికి ప్రయత్నించిన యువకుడు ఆటో బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మాచర్ల మండలం తేరాలకు చెందిన సాయికృష్ణ(22) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆటోలో స్వగ్రామం నుంచి మాచర్ల వెళ్తుండగా.. మండాది గ్రామ సమీపంలోకి చేరుకోగానే గుట్కా తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఓ ప్రయాణికుడు ఆటోలో నుంచి దూకి తన ప్రాణాలు రక్షించుకోగా.. సాయికృష్ణ మాత్రం అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement