ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు | Sakshi
Sakshi News home page

ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు

Published Mon, Dec 14 2015 8:46 PM

Siliguri to Alipurduar DEMU passenger train derailed after hitting an elephant in west bengal

గుల్మా: అభయారణ్యం నుంచి పొరపాటున పట్టాలపైకి వచ్చిన ఏనుగును ఢీకొన్న రైలు పట్టాలు తప్పింది. పశ్చిమబెంగాల్ లోని గుల్మా ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

సిలిగురి నుంచి అలీపూర్ డెమూ ప్యాసింజర్ రైలు.. గుల్మా- సెవోక్ స్టేషన్ల మధ్య ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పింది. చనిపోయిన ఏనుగు మహానంద అభయారణ్యానికి చెందిందని తెలిసింది. కాగా, ఈ సంఘటనలో ప్రయాణికులు గాయపడిందీ, లేనిదీ తెలియాల్సిఉంది.

Advertisement
Advertisement