చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌ | Sakshi
Sakshi News home page

చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌

Published Mon, Aug 22 2016 2:26 AM

చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌ - Sakshi

చంద్రగిరి: ఏపీలోని చంద్రగిరి కోటను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ కోటలోని ఆయుధాలు, అలనాడు ఆరాధించిన దేవేరుల శిలా విగ్రహాలను పరిశీలించారు. రాయల కాలం నాటి వస్తువులతో పాటు బ్రిటిష్‌ కాలం నాటి నాణేలు, పత్రాలను నేటి తరం వారికి పరిచయం చేయడానికి పురావస్తు శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Advertisement
Advertisement