టుడే న్యూస్ డైరీ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Sat, Feb 20 2016 6:38 AM

today news dairy

వనజాతర: వైభవోపేతంగా సాగుతోన్న మేడారం సమ్మక్క-సారక్క జాతర శనివారంతో ముగియనుంది. నేటి సాయంత్రం సమ్మక్క, సారక్కలు వనప్రవేశం చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు సహా పలువురు కీలకనేతలు హాజరుకానున్నారు.

రాజ్యసభ అఖిలపక్ష భేటీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నేతృత్వంలో నేడు రాజ్యసభ అఖిలపక్ష భేటీ జరగనుంది.

సుప్రీం విచారణ: పటియాలా హౌస్ కోర్టు వద్ద లాయర్ల ఘర్షణలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 

వామపక్షాల బస్సుయాత్ర: ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీని డిమాండ్ చేస్తూ నేటి నుంచి వామపక్ష పార్టీలు బస్సుయాత్ర ప్రారంభించనున్నాయి. తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు సీపీఎం, సీపీఐ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, నారాయణ తదితరులు హాజరుకానున్నారు.

సీఎంతో సమావేశం: విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కేఈ, శిల్పా సోదరులు ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.

విజయవాడలో దిగ్విజయ్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ విజయవాడ పర్యటన రెండో రోజుకు చేరింది.

ఆసియా టీమ్ బ్యాడ్మింటన్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సెమీఫైనల్స్ లో నేడు ఇండోనేషియాతో భారత్ తలపడనుంది. సాయంత్ర 4:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదాద్రిలో నేడు పాతగట్టు లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణం జరగనుంది.

Advertisement
Advertisement