టుడే న్యూస్ డైరీ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Sun, Mar 27 2016 6:46 AM

today news diary

► నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

► నేడు హైదరాబాద్ లో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పర్యటన. చర్లపల్లి జైలులో హెచ్ సీయూ విద్యార్థులను ఆయన పరామర్శించనున్నారు.

► పంజాబ్: నేడు పఠాన్కోట్కు రానున్న ఐదుగురు సభ్యుల పాక్ విచారణ బృందం

► తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది.

► నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ భేటీ కానున్నారు.

► తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం నేడు జరగనుంది. ఈ నెల 30, 31న అసెంబ్లీలో చర్చించాల్సిన ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు.

► నేడు గుజరాత్ లో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

► టీ20 వరల్డ్కప్లో భాగంగా మొహాలీలో నేడు భారత్, ఆస్ట్రేలియాల మధ్య కీలక పోరు.

Advertisement
Advertisement