♦ నేడు కృష్ణాష్టమి, దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
♦ తిరుపతి: నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం, రేపు ఉట్లోత్సవం
♦ నేడు తిరుపతి వెళ్లనున్న పవన్కల్యాణ్, ఇద్దరు హీరోల ఘర్షణ విషయంలో చనిపోయిన వినోద్
♦ అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
♦ నేడు నెల్లూరు జల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Breadcrumb
# Tag
Related news
-
'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. "Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU — ANI (@ANI) July 17, 2023 బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. Opposition leaders' dinner meeting concludes in Karnataka's Bengaluru; Opposition leaders leave the meeting venue pic.twitter.com/FijRJO4ANl — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with AAP MP Sanjay Singh arrives at the venue of the Opposition meeting in Bengaluru, received by Karnataka CM & Congress leader Siddaramaiah, deputy CM DK Shivakumar and party leader KC Venugopal, in Bengaluru pic.twitter.com/ResmhdV5rn — ANI (@ANI) July 17, 2023 బీజేపీని ఓడించే లక్ష్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ్వానం పలికారు. #WATCH | JD(U) leader and Bihar CM Nitish Kumar arrives for Opposition dinner meeting in Bengaluru, Karnataka pic.twitter.com/Fag2a6OK8a — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi arrive at Bengaluru ahead of joint Oppn meeting Read @ANI Story | https://t.co/Vb0wqrGsl0#SoniaGandhi #MallikarjunKharge #RahulGandhi #Bengaluru pic.twitter.com/8f3MaeRTvl — ANI Digital (@ani_digital) July 17, 2023 బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. #WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, who arrived in Bengaluru today to participate in the joint Opposition meeting, was received by Karnataka Ministers MB Patil and Lakshmi Hebbalkar. (Video: MB Patil) pic.twitter.com/ohxBhot7m2 — ANI (@ANI) July 17, 2023 రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. West Bengal CM and TMC leader Mamata Banerjee and party MP Abhishek Banerjee arrived in Bengaluru for the two-day joint Opposition meeting. Karnataka Deputy CM DK Shivakumar received them. (Pics: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/3VXQG45kCc — ANI (@ANI) July 17, 2023 #WATCH | West Bengal CM and TMC leader Mamata Banerjee arrives in Bengaluru for the two-day joint Opposition meeting. pic.twitter.com/qXmrEtV7uw — ANI (@ANI) July 17, 2023 అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. #WATCH | RJD chief Lalu Prasad Yadav and party leader-Bihar Deputy CM Tejashwi Yadav leave from Patna. They will participate in the joint Opposition meeting in Bengaluru. pic.twitter.com/cmHOhJWMgR — ANI (@ANI) July 17, 2023 బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్ హోటల్లో వీరు సమావేశం కానున్నారు. #WATCH | Congress president Mallikarjun Kharge and Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrive in Bengaluru for the joint opposition meeting which will have the participation of 26 like-minded parties. pic.twitter.com/OogxvHsDnK — ANI (@ANI) July 17, 2023 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ.. -
సాక్షి స్పీడ్ న్యూస్ 10 January 2022
సాక్షి స్పీడ్ న్యూస్ 10 January 2022 -
సాక్షి స్పీడ్ న్యూస్ 01 September 2021
సాక్షి స్పీడ్ న్యూస్ 01 September 2021 -
టుడే అప్డేట్స్..
సాక్షి, హైదరాబాద్ : నేటి నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఒత్తిడితో విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసుల పునరుద్దరణకు ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ విమానశ్రయాల నుంచి సర్వీస్లను పునరుద్దరించాలని పౌరవిమానయన శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక నేటి అప్డేట్స్ ఇవి.. ► రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. ► ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా నేడు గవర్నర్ హరిచందన్ బిశ్శభూషణ్ కుటుంబసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ► శ్రీశైలం దసరా మహోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ► తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి హంస వాహనంపై మలయప్ప స్వామి అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు. తెలంగాణ అప్డేట్స్.. నేడు ప్రగతిభవన్లో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటి జరగనుంది. హైదరాబాద్లో నేడు.. ► వేదిక: శిల్పారామం, ఉప్పల్ ఫోక్ డ్యాన్స్ బై రాధిక శ్రీనివాస్ శక్తి సమయం: సాయంత్రం 5 గంటలకు కూచిపూడి రెక్టికల్ వనిరామం స్టూడెంట్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం రెక్టికల్ సమయం: సాయంత్రం 5 గంటలకు కథక్ రెక్టికల్ సమయం: సాయంత్రం 5–30 గంటలకు ఒగ్గు డోలు ఫోక్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► వేదిక: లాల్ బహదూర్స్టేడియం వ్రెస్లింగ్ కాంపిటీషన్, సమయం: ఉదయం 8 గంటలకు ఆల్ ఇండియా ఒపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్, సమయం: సాయంత్రం 6 గంటలకు ► చిల్డర్న్ ఆఫ్ మెన్ – ఇంగ్లిష్ ఫిల్మ్ ఫ్రీ స్క్రీనింగ్ వేదిక: నృత్య – ఫోరమ్ ఫర్ ఫర్ఫామింగ్ ఆర్ట్స్, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 6–30 గంటలకు ► ఆకృతి ఎలైట్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్, సమయం: సాయంత్రం 4 గంటలకు ► ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ వేదిక: హైదరాబాద్ షెరటాన్ హోటల్, గచ్చిబౌలి, సమయం: రాత్రి 7 గంటలు ► అక్టోబర్ ఫెస్ట్: ట్రెడిషనల్ ఫుడ్ వేదిక: ది వెస్ట్రన్ హైదరాబాద్ మైండ్ స్పేస్, హోటల్ మాదాపూర్ ,సమయం: సాయంత్రం 5 గంటలు ► మహాత్మ 150 డ్రాయింగ్స్ బై శంకర్ పామర్తి వేదిక: కళాకృతి, బంజారాహిల్స్ , సమయం: ఉదయం 10–30 గంటలకు ► సౌత్ కాస్ట్ స్పైస్ట్రైల్ వేదిక: ఫార్చూన్ పార్క్ వల్లభ హోటల్ , రోడ్నం.12, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 5 గంటలు ► డిస్కో దాండియా వేదిక– ది పార్క్ హైదరాబాద్, సోమాజీగూడ ,సమయం: సాయంత్రం 6 గంటలకు ► నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: బేగంపేట్ హాకీ స్టేడియం, రసూల్పుర, సమయం: సాయంత్రం 6–30 గంటలకు ► నాందారీ గౌరవ్ నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: ఎస్ ఎస్ కన్వెంషన్ సెంటర్, శంషాబాద్, సమయం: రాత్రి 9 గంటలకు ► సిల్క్ ఆండ్ కాటన్ ఎగ్జిబిషన్ వేదిక: టీటీడీ బాలాజీ భవన్, హిమాయత్నగర్, సమయం: ఉదయం 10–30 గంటలకు ► ఏ జోన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ వేదిక: ఇండోర్ స్టేడియం , గచ్చిబౌలి, సమయం: ఉదయం 7 గంటలు ► రామాయణ్ మేళా వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, సమయం: రాత్రి 7 గంటలకు ► నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్ ,సమయం: రాత్రి 7 గంటలకు ► ఆల్ ఇండియా శారీమేళ, దసరా ఫెస్టివల్ వేదిక: శిల్పారామం , సమయం: ఉదయం 11–30 గంటలకు ► డైమండ్ జ్యువెలరీ – ఎగ్జిబిషన్ వేదిక: ఒఆర్ఆర్ఎ డైమండ్ జ్యువెలరీ , పంజాగుట్ట, సమయం: ఉదయం 10 గంటలకు ► పాన్ ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ , సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు ► ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ వేదిక:తెలంగాణస్టేట్గ్యాలరీఆఫ్ఫైన్ ఆర్ట్స్, సమయం: ఉదయం 9 గం. ► వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ యోగా క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు భరత నాట్యం క్లాసెస్, సమయం: సాయంత్రం 5–30 గంటలకు మోహినీయట్టం క్లాసెస్, సమయం: సాయంత్రం 4.30 గంటలకు. -
టుడే న్యూస్ రౌండప్
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులు మోహరింపు పెరిగిపోయింది. పాదయాత్రకు అడ్డంకులు ఎదురుకావడంపై కాపు ఉద్యమనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► లార్డ్స్లో జరుగుతున్న ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతోంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హోదాలో మిథాలీ రాజ్ రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నారు. మరిన్ని ప్రధాన వార్తల అప్డేట్స్ మీ కోసం.. <<<<<<<<<<<<<<<<పాలిటిక్స్>>>>>>>>>>>>>>>>> పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి! బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఏపీ మంత్రి ఓవరాక్షన్! జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్ చేశారు టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా.. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్ భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. <<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>> డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. విదేశీ ప్రధాని.. దేశీ అవతార్! హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. భారత్లో ఏకంగా 927 ఉగ్రదాడులు.. భారత్కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది. <<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>> రాష్ట్రాలకు ప్రత్యేక జెండా.. డిమాండ్ ఉధృతం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం! టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. పాకిస్థాన్కు వెంకయ్య ఘాటు వార్నింగ్! ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగుదేశం పాకిస్థాన్ 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఓ సారి గుర్తుకుతెచ్చుకోవాలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. <<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>> మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ధోని హ్యాట్రిక్ సిక్సర్లు! చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. మిథాలీ సేనకు ధోని సందేశం నేడు మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ మద్య జరగనుంది. <<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>> సూపర్ స్టార్ ఒక్కడే మిగిలాడు..! క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. 'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి! టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఏడో ఎపిసోడ్లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్ వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు.
Related News by category
-
ఇక భూమిపై బతుకు భారం కాబోతుందా?
వంద కోట్ల మందికి పైగా రోజు మూడుపూట్ల తిండి దొరకడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికే తిండి, గూడు, గుడ్డ దొరకక అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. మరి ఇంతకు మరింత రెట్టింపుగా జనాభా పెరిగితే పరిస్థితి ఏమిటి? తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది? అధిక జనాభా వలన కలిగే నష్టాలు ఏమిటి? జనాభానియంత్రణకు చేపట్టవలసిన విధానాల గురించి తెలుసుకుందాం.... -
ఆర్కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ దీపావళి శుభవార్త
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేటును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. కోటి రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీంతో ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాల పరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. 3-5 సంవత్సరాల డిపాజిట్ల వడ్డీరేటు 7.25 శాతానికి, వార్షిక డిపాజిట్లపై అందించే రేటు 7.3 శాతానికి చేరింది. ఈ సవరించిన రేట్లు నిన్నటినుంచే అమల్లోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమ వార్షిక ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటు 8.20శాతం నుంచి 8.30శాతానికి చేరింది. ఈ సవరించిన వడ్డీరేటు నేటి(నవంబరు 7, బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. -
షాకింగ్: నోట్ల ముద్రణను తగ్గిస్తున్న ఆర్బీఐ?
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లను ముద్రించడం కోసం ఆర్డరును తగ్గించింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు సహా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో కరెన్సీ ఖజానా గది పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డీమానిటైజ్ చేసిన పాత రూ.500, రూ.1000నోట్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ...కొత్త కరెన్సీ ఖజానా గదులు ఖాళీ లేకపోవడంతో ప్రింటింగ్ ఇండెట్ను తగ్గించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయిదేళ్ల కనిష్ట స్థాయికి ప్రింటింగ్ ఆర్డర్లపై ఆర్బీఐకోత పెట్టిందని మింట్ రిపోర్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ద్వారా ఈ సమాచారం అందినట్టు రిపోర్ట్ చేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఇండెంట్ 21 బిలియన్లు ఉండనుందని, ఇది గత ఏడాది 28 బిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ అని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో బ్యాంకు నోట్ల సగటు వార్షిక ఇండెంట్ 25 బిలియన్లుగా ఉంది. 50-60శాతం రద్దైన నోట్లను ఆర్బీఐకి బదలాయించినప్పటికీ తమ వద్ద చాలా తక్కువ స్థలం ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. పాత రూ.500, 1000నోట్లు కుప్పలుతెప్పలుపేరుకుపోవడం, వీటిని నాశనం చేయడాకంటే ముందు లెక్కింపు పూర్తికావడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. ఇండెంట్ తగ్గింపు అనేది ఉత్పత్తి సామర్థ్యాలు, పరిమితులకు లోబడి ఆర్బీఐ సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చిరిగిపోయిన నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే ప్రింటింగ్ ఇండెంట్ కోత నగదు లావాదేవీలపై మరింత భారం పెంచుతుందని చెప్పారు. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించేందుకు ఆర్బీఐ నిరాకరించినట్టు తెలుస్తోంది. -
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
సాక్షి,ముంబై: రికార్డ్ స్థాయిలో మోత మోగించిన స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్గా మారాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో ప్రధాన ఇండెక్సులు స్వల్ప నష్టాలతో ముగిశాయి. కన్సాలిడేషన్ మూడ్లో ఉన్న మార్కెట్లో సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 33573 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 10, 422 వద్ద ముగిసింది. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంక్ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా, కొనుగోళ్ల మద్దతుతో ఫార్మా రంగం రీబౌండ్ అయింది. దీంతో ఇవాల్టి మార్కెట్లకు ఫార్మా దూకుడు మంచి మద్దతు ఇచ్చిందని చెప్పవచ్చు. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు నష్టాల్లో ముగిశాయి. దివీస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, హెక్సావేర్, అరబిందో, లుపిన్, డా. రెడ్డీస్ టాప్విన్నర్స్గా నిలవగా వీటితోపాటు క్యాడిల్లా హెల్త్కేర్, ఐడియా లాభపడ్డాయి. మరోవూపు టెక్ మహీంద్రా, సెయిల్, భారతి ఎయిర్టెల్, కెనరా బ్యాంక్,హెచ్డీఎల్ ఫెడరల్బ్యాంక్, హిందాల్కో, స్టేట్బ్యాంక్, ఎంఅండ్ఎం నష్టపోయినవాటిల్లో ఉన్నాయి.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Chicken
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
టీ20 వరల్డ్కప్ కోసం జట్టును ప్రకటించిన కెనడా
ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..
పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement