సీడ్ క్యాపిటల్ ప్లాన్ను నేడు సీఎంకు అందించనున్న సింగపూర్ బృందం
* రైతులకు స్థలాలు ఎక్కడ వస్తాయో చెప్పలేమంటున్న అధికారులు
* సొంత గ్రామాల్లో ఇవ్వడం కష్టమేనని స్పష్టీకరణ
* ఆందోళనలో రాజధాని ప్రాంత అన్నదాతలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సేవలను మరిచిపోలేం. వారికిచ్చే వాటా భూముల కింద రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ల స్థలాలను సొంత గ్రామాల్లోనే ఇచ్చేటట్లు చూస్తాం.
రాజధాని మాస్టర్ ప్లాన్ తర్వాతే ఎక్కడ స్థలాలు ఇస్తామో చెబుతాం’’.... రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పలుమార్లు చేసిన ప్రకటనలు ఇవీ. కానీ, ఆచరణలోకి మాత్రం రావడం లేదు. సీడ్ క్యాపిటల్ ప్లాన్ కూడా అందుతున్న తరుణంలో రైతుల వాటా భూములపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ ప్లాన్ను అందిస్తుండడంతో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్రణాళికలు దాదాపు సిద్ధమైనట్లే. అయితే, సర్కారు మాత్రం రైతుల వాటా భూములు ఎక్కడుంటాయో మాత్రం చెప్పడం లేదు.
రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అందిన తర్వాతే రైతుల వాటా భూములు ఎక్కడ వస్తాయో వెల్లడిస్తామని సీఆర్డీఏ వర్గాలు పలుమార్లు ప్రకటించాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ అందించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం ఇవ్వనున్న సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్తో రాజధాని నిర్మాణానికి అన్ని రకాల ప్రణాళికలు అందించే ప్రక్రియ పూర్తయినట్లే. రాష్ట్ర ప్రభుత్వం ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి సారించనుంది.
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏయే ప్రాంతాల్లో కమర్షియల్, రెసిడెన్షియల్ స్థలాలు వస్తాయన్నది చెప్పలేమని సీఆర్డీఏ అధికారులు అంటుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ గ్రామానికి చెందిన రైతులకు ఆ గ్రామంలోనే స్థలాలు ఇవ్వడం కష్టమని అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తం 33 వేల ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు 25,200 ఎకరాలకు మాత్రమే రైతులు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన 8 వేల ఎకరాలకు గాను ఒప్పందాలు చేసుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం.
హైదరాబాద్కు చేరుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్
సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందించేందుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన బృందంతో ఆదివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. సింగపూర్ బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకోనుంది. ఈ బృందానికి గోదావరి పుష్కర సాన్నాలు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాల అనంతరమే సీడ్ క్యాపిటల్ ప్లాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాజధాని విస్తీర్ణం పెంపు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచింది. తొలుత సిటీ విస్తీర్ణాన్ని 212 చదరపు కిలోమీటర్ల మేరకే పరిమితం చేస్తూ సింగపూర్ కంపెనీలు క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. అయితే తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు క్యాపిటల్ సిటీ పరిధిని అదనంగా 162 చదరపు కిలోమీటర్ల మేరకు సింగపూర్ కంపెనీలు పెంచాయి.
ఈ పెంపుతో మొత్తం రాజధాని నగర విస్తీర్ణం 212 చదరపు కిలోమీటర్ల నుంచి 374 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కృష్ణా నది అవతలి ఒడ్డు తొలుత క్యాపిటల్ సిటీలో లేదు. ఇప్పుడు పరిధి పెంచడం ద్వారా కృష్ణా నది అవతలి ఒడ్డును కూడా సిటీ మాస్టర్ ప్లాన్లో చేర్చారు. కృష్ణా నది అవతలి ఒడ్డులో 30 చదరపు కిలోమీటర్లను నగర పరిధిలోకి తీసుకొచ్చారు.
రైతుల వాటా భూములెక్కడ?
Published Mon, Jul 20 2015 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement