మూడేళ్లలో ఆయన చేసిందేం లేదు | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ఆయన చేసిందేం లేదు

Published Sat, Jul 15 2017 1:27 PM

ysrcp sevadal leaders fires on jotula nehru family

కాకినాడ: జ్యోతుల నవీన్‌ జెడ్పీ ఛైర్మన్‌ పదవిని చేపట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ సేవాదళ్‌ నేత ఉమ్మి రఘురాం నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరపున జెడ్పీటీసీగా గెలిచి రాజీనామా చేయకుండా టీడీపీలో ఎలా చేరుతారంటూ ప్రశ్నించారు. జెడ్పీఛైర్మన్‌గా పదవిని చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. గత మూడేళ్లలో జగ్గంపేట నియోజక వర్గానికి జ్యోతుల నెహ్రూ చేసిందేమీ లేదని  రఘురాం ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement