► గ్రూప్-2లో 439 పోస్టులకు 5,64,431 దరఖాస్తులు
► అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది
► అత్యల్పంగా నిజామాబాద్ నుంచి 33,473 మంది పోటీ
► ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష..
► ఏర్పాట్లు ప్రారంభించిన టీఎస్పీఎస్సీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రకటించిన గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఐదు శాఖల పరిధిలోని 439 పోస్టులకు 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,03,379 మంది మహిళా అభ్యర్థులు, 3,61,052 మంది పురు ష అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా ఒక్కో పోస్టుకు సగటున 1,285 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే... అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా నుంచి 33,473 మంది పోటీ పడుతున్నారు.
ఇక ఈసారి పోస్టుల భర్తీలో ప్రభుత్వం వయోపరిమితిని సడలించడంతో... 34 ఏళ్ల వయసు దాటిన 64,206 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39-44 ఏళ్ల మధ్య వయసున్న వారు 16,465 మంది, 44 ఏళ్లు దాటినవారు 2,758 మంది ఉన్నారు. గ్రూప్-2 పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసినందున పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషన్ చైర్మన్ చక్రపాణి తెలిపారు.
పది లక్షలు దాటిన వన్టైమ్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ద్వారా ఇప్పటివరకూ పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ నెల 9వ తేదీ నాటికి 10,04,427 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
గ్రూప్-2.. ఒక్కో పోస్టుకు 1,285 మంది
Published Fri, Feb 12 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement