- ముగిసిన తొలిదశ కౌన్సెలింగ్
- జూలైలో రెండో దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్లలో కలిపి మొత్తం 50,632 సీట్లు ఉండగా... 37,467 మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే తమకు కేటాయింపు జరిగిన కాలేజీల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 97.84 శాతం మంది అభ్యర్థులు రిపోర్టు చేయగా, ప్రైవేటు పాలిటెక్నిక్లలో చేరింది 66.53 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న రెండు ఎయిడెడ్ పాలిటెక్నిక్ల్లో మాత్రం సీట్లు పొందిన వారంతా (100శాతం) చేరారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,165 సీట్లు ఖాళీగా మిగిలిపోనున్నాయని అధికార వర్గాల సమాచారం.
పాలిసెట్-2016లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సాంకేతిక విద్యా మండలి గత నెల 20 నుంచి నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం 45,644 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే కాలేజీలో చేరేందుకు చివరి రోజైన శనివారం నాటికి 37,467 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేశారు.
వచ్చే నెల రెండో వారంలో..
పాలిసెట్ రెండోదశ కౌన్సెలింగ్ను జూలై రెండో వారంలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిసెట్లో ర్యాంకులు పొందిన కొందరు అభ్యర్థులు పదో తరగతిలో ఫెయిల్ కావడంతో తొలిదశ కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయినట్లు అంచనా. జూలై 10గా టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన ్నందున రెండో వారంలో రెండోదశ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో మిగిలిపోయిన సీట్లన్నీ రెండోదశలో భర్తీ అవుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఇక సాంకేతిక విద్యామండలి పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలో ఈ నెల 9 నుంచే తరగతులు ప్రారంభమైనట్లు కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.
పాలిటెక్నిక్లలో 13 వేల సీట్లు ఖాళీ!
Published Sun, Jun 12 2016 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement