పీఓ అశ్వినీ సత్తార్
‘ఎక్స్పిడీషియస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్’ ప్రారంభం
మూడు రోజుల్లో వెరిఫికేషన్: కమిషనర్ సీవీ ఆనంద్
ఎస్బీ సిబ్బందికి ట్యాబ్స్ పంపిణీ
గచ్చిబౌలి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లే ఈ ఏడాది 8 లక్షల పాస్పోర్టులు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు అధికారి అశ్వినీ సత్తా ర్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ‘ఎక్స్పిడీషియస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్’ను ఆమె ముఖ్యతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ సత్తార్ మాట్లాడుతూ విదేశాంగ శాఖ గతేడాది ఆయా రాష్ట్రాలకు కోటి పాస్పోర్టులు లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో 7 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో 8 లక్షల పాస్ పోర్టులు జారీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలో పాస్పోర్టుల జారీలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. పారదర్శకంగా వెరిఫికేషన్ రిపోర్టు ఇచ్చే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తాత్కాల్ పాస్పోర్టు కోసం ఐపీఎస్ల వెరిఫికేషన్ తప్పని సరికాదని అఖిల భారత సర్వీస్లో విధులు నిర్వహిస్తున్న గెజిటెడ్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేయొచ్చన్నారు. ఇంటెలిజెన్స్ డీఐజీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం జిల్లాలోని ఎస్పీ కార్యాలయాలకు పాస్పోర్టు వెరిఫికేషన్ కోసం ఎంతో మంది వచ్చేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
107 రోజుల నుంచి 7 రోజులకు తగ్గిండమే ఎంతో గొప్ప విషమన్నారు. నేడు వెరిఫికేషన్ సమయాన్ని 3,4 రోజులకు తగ్గిండం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదన్నారు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ రమేశ్ మాట్లాడుతూ... పాస్పోర్టుల జారీలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. పాస్పోర్టు వెరిఫికేషన్ చేసేందుకు 2012లో దేశ వ్యాప్తంగా సరాసరి 107 రోజులు పడితే.. సమైకాంధ్రలో 21 రోజులు పట్టేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి 9 రోజులలో వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ విభాగం, సైబరాాబాద్ పోలీసులు, రీజనల్ పాస్పోర్టు అధికారులు 8 నెలలు శ్రమించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ‘ఎక్స్పిడీషియస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్’ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 13 రోజుల ఉన్న వెరిఫికేషన్ సమయాన్ని 3 లేక 4 రోజులకే పరిమితం చేయనున్నామన్నారు. ఆన్లైన్ పాస్పోర్టు దరఖాస్తులను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ల (ఎస్బీ అధికారి)కు పంపిస్తామన్నారు.
వారు ట్యాబ్లో దరఖాస్తును చూసుకొని వెరిఫికేషన్ చేసి రిపోర్టును ట్యాబ్లోనే సబ్మిట్ చేస్తారన్నారు. ఆ రిపోర్టును సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సిబ్బంది పరిశీలించి రీజనల్ పాస్పోర్టు కార్యాలయానికి ఆన్లైన్లో పంపిస్తారని, దీంతో 3 లేదా 4 రోజుల్లో పాస్పోర్టు జారీ చేసేందుకు అవకాశముంటుందని చెప్పారు. వెరిఫికేషన్కు ఎప్పుడు వచ్చేది దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ అలర్ట్ పంపిస్తామన్నారు. కాగా, ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రఘువాసు రూపొందించారు.
8 లక్షల పాస్పోర్టుల జారీ లక్ష్యం
Published Tue, Feb 3 2015 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement