సికింద్రాబాద్లో సంచలనం | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్లో సంచలనం

Published Sat, May 9 2015 10:08 PM

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏకే47 - Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్లో ఒక వ్యక్తి ఏకే 47 గన్ పట్టుకొని తిరుగుతుండటం సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే ఉత్తర మండలం టాస్క్ ఫర్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆ గన్ పట్టుకు తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బీహార్కు చెందిన అఖిలేష్  అనే వ్యక్తి ఏకే 47 పట్టుకొని తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అరెస్ట్ చేసి, ఆ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అతనిని రిమాండ్ కు తరలించారు.

Advertisement
Advertisement