ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: వైద్య విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: వైద్య విద్యార్థి మృతి

Published Fri, Apr 3 2015 12:21 PM

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: వైద్య విద్యార్థి మృతి - Sakshi

హైదరాబాద్: నార్సింగ్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  వైద్య విద్యార్థులంతా సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
Advertisement