పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం

Published Fri, Feb 9 2018 4:33 PM

accident at PV express highway

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నంబర్‌ 219 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement