పూలే జయంతి రోజున సెలవు ప్రకటించాలి
జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ఉస్మానియా యూనివర్సిటీ: దేశ చరిత్రలో మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, పాఠ్యాంశాలలో ఫూలే జీవిత చరిత్రను చేర్చాలని సినీ నటుడు సుమన్ కోరారు. ఈ మేరకు తాను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫూలే 189వ జయంతి ఉత్సవాల సందర్భంగా సభ నిర్వహించారు.
కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ ఛైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు సుమన్ మాట్లాడుతూ హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో సరైనోడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పటికీ పూలే జయంతి సభకు హాజరయ్యానని సుమన్ వివరించారు. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, విశిష్ట అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, యువజన నాయకుడు అనిల్కుమార్యాదవ్, బీసీ జేఏసీ చైర్మన్ బొమ్మ హన్మంతరావు, కన్వీనర్ పుప్పాల మల్లేష్, తెలంగాణ విద్యార్థి సెఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్గౌడ్, చెన్న శ్రీకాంత్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రీ, టీఆర్ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ద్వాత్రిక స్వప్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, రాజ్యసభ సభ్యులు వీహెచ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన పై విరుచుకపడ్డారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.
ప్రధాని మోదీకి లేఖ రాస్తాను: నటుడు సుమన్
Published Mon, Apr 11 2016 9:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరింత ఆలస్యంగా..?
పాలమూరుకు ఎంత చేసినా తక్కువే..
బీఆర్ఎస్, బీజేపీ హామీలు నమ్మొద్దు
ఆషామాషీ ఎన్నికలు కావు..
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
ఎన్నికల నిర్వహణలో అధికారులదే కీలకపాత్ర
జీవితంలో విద్యార్థి దశ కీలకం
వీడియోలు, ప్రకటనలపై ప్రత్యేక దృష్టి
ఎంత చేసినా తక్కువే..
● నేడు ఉమ్మడి జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● హాజరుకానున్న 4,434 మంది విద్యార్థులు ● 11నుంచి 1–30గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement