- అదనంగా 2.86 మీటర్ల లోతుల్లోకి పడిపోయిన భూగర్భ జలాలు
- వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : పాతాళగంగా ఇంకా పైకి రావడంలేదు. రాష్ట్రంలో భూగర్భ జలాలు గతేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో 2.86 మీటర్ల అదనపు లోతుల్లోకి పడిపోయాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ బుధవారం నివేదిక విడుదల చేసింది. గతేడాది జూన్లో రాష్ట్రంలో 12.56 మీటర్ల లోతుల్లో జలాలు లభ్యం కాగా, ఈ ఏడాది అదే నెలలో 15.42 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గతేడాది జూన్ నెలలో 14.54 మీటర్ల లోతుల్లో జలాలు లభిస్తే, ఈ ఏడాది అదే నెలలో 20.64 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ గతేడాది జూన్ నెలతో పోలిస్తే భూగర్భ జలాలు మెరుగైనస్థితిలో లేవు.
51 శాతానికి చేరుకున్న పంటలసాగు
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. ఖరీఫ్లో సాధారణంగా 1.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 54.92 లక్షల ఎకరాల్లో (51%) సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. ఖరీఫ్లో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.55 లక్షల ఎకరాల్లో (104%) సాగైంది. అందులో కంది 104 శాతం, పెసర 109 శాతం, మినప నూటికి నూరు శాతం సాగైనట్లు నివేదిక వెల్లడించింది.
వరి నాట్లు మాత్రం ఇంకా 8 శాతానికి మించలేదు. సాధారణంగా ఖరీఫ్లో 24.65 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2.05 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇక పత్తి 23.52 లక్షల ఎకరాల్లో సాగైంది. అందుకు ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న సోయాబీన్ కేవలం 6.75 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవానికి సోయాబీన్ సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం 12 లక్షల ఎకరాలకు పెంచాలని భావించింది. మున్ముందు సోయా సాగుకు అనువైన కాలం కాదు. దీంతో మిగిలిన చోట్ల రైతులు సోయాకు బదులు పత్తి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
33 శాతం అధిక వర్షపాతం
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటివరకు 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 713.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. బుధవారం నాటికి 214.4 ఎం.ఎం.లు నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 285.5 ఎం.ఎం.లు నమోదైంది. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో అధికం, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పాతాళ గంగ.. అడుగంటే అదనంగా!
Published Thu, Jul 14 2016 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement