అగ్రిగోల్డ్‌ కేసు.. వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసు.. వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా

Published Fri, Feb 19 2016 3:53 PM

Agrigold case investigation adjourned to next friday

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్‌ సంస్థ బ్యాంకు ఖాతాలు, నగదుపై సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. 22 ఖాతాల్లో రూ. 6 లక్షల నగదు ఉన్నట్టు సీఐడీ కోర్టుకు తెలిపింది. అయితే 10 వేల కోట్లు డిపాజిట్లు సేకరించిన సంస్థ ఖాతాల్లో.. కేవలం 6 లక్షల రూపాయలు ఉండటమేంటని హైకోర్టు ప్రశ్నించింది. రెండు సంవత్సరాల్లో ఎంత మొత్తంలో డబ్బు డ్రా అయిందని కోర్టు ప్రశ్నించింది.

ఇలా అయితే బాధితులకు ఎలా న్యాయం చేస్తారని హైకోర్టు చివాట్లు పెట్టింది. కస్టడీ విచారణ వివరాలు తెలిపాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. కమిటీ ఖర్చుల కోసం రూ. 25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement