బాబు అవినీతిపై అమెరికాలోనూ చర్చ | Sakshi
Sakshi News home page

బాబు అవినీతిపై అమెరికాలోనూ చర్చ

Published Sat, May 21 2016 2:16 AM

బాబు అవినీతిపై అమెరికాలోనూ చర్చ - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ సూత్రాలకు భిన్నంగా తె లుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతోందని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లకాలంలో సీఎం చంద్రబాబు అవినీతి కార్యక్రమాల గురించి అమెరికాలోని తెలుగువారిలోనూ ప్రముఖంగా చర్చ జరుగుతోందన్నారు.

రాష్ట్ర కొత్త రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మిస్తానని చెప్పి కుటుంబసభ్యులతో భూమిపూజ కార్యక్రమాలు చేపట్టడం వంటి చిన్న విషయాల్ని అక్కడి తెలుగువారు ప్రముఖంగా చెప్పుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్లు, ఇళ్ల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలులో టీడీపీ అనుకూలురకు ఒక న్యాయం, వ్యతిరేకులకు మరో న్యాయం సాగుతున్న తీరును అక్కడివారు ప్రశ్నిస్తుంటే.. తానే జవాబు చెప్పలేకపోయానని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

 మా సీటు మాదే : లక్షల కోట్ల అవినీతి డబ్బులతో కొందరు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసినప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి లభించే ఒక్క సీటు తమకే దక్కుతుందని శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement