♦ ప్రజాదరణ ఉందన్న భ్రమ కల్పించేందుకే ఫిరాయింపులకు చంద్రబాబు ప్రోత్సాహం
♦ వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి గట్టిగా నిధులు అడిగి తెచ్చుకునే ధైర్యం లేకపోవడంతోపాటు రెండేళ్ల పాలనలో హామీలు నెరవేర్చక ప్రజల మన్నన పొందలేకపోయిన సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని డబ్బులిచ్చి కొని తనకే ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని కాపాడడానికి ఏకంగా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ విలువల్నిసైతం చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘కేంద్ర ఆర్థికమంత్రి రాష్ట్రానికి రూ.రెండువేల కోట్లివ్వాలని ప్రతిపాదిస్తే.. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కేవలం రూ.900 కోట్ల విడుదలకు అంగీకరించింది. గతంలో ఇచ్చిన నిధులకు సంబంధించి ఖర్చుల వివరాలతో కూడిన యూసీ సర్టిఫికెట్ ఇచ్చేవరకూ ఆ రూ.900 కోట్లను కూడా విడుదల చేయవద్దని ప్రధాని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు రాష్ట్రానికిచ్చిన డబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదని వారితో కలసి పోటీ చేసినవారే అనుమానపడే పరిస్థితి ఏర్పడిందంటే.. అందుకు బాబు సిగ్గుపడాలి’’ అని విమర్శించారు. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడమే కాదు.. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే మీడియాను, పత్రికలను బెదిరించడానికి ప్రభుత్వంలోని వారు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. డబ్బులతో శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని బాబు, ఆయన కుమారుడు విర్రవీగుతున్నారని, ఇలాంటి ఆలోచనలు చేసిన ఎందరో యోధులే మట్టికరిచారని వ్యాఖ్యానించారు.
ఎంత రెచ్చగొట్టినా జగన్ ప్రజా గొంతుకే అయ్యారు
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. వాళ్లు అనుభవం లేదంటున్నా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పి ప్రజల సమస్యల్ని సభలో బలంగా వినిపించారని అంబటి తెలిపారు. అనుభవం లేదన్న జగన్కు పట్టుమని ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా మాట్లాడే అవకాశం ఎందుకు దక్కనీయలేదని ప్రశ్నించారు.
కేంద్రాన్ని నిధులు అడిగే ధైర్యముందా?
Published Sat, Apr 2 2016 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement