22 నుంచి 24 వరకు నల్లగొండ జిల్లాలో
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22న ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తర్వాత 11.15కు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 నిమిషాలకు నల్లగొండ జిల్లా చండూరు మండలం, తేరేటుపల్లి గ్రామా నికి చేరుకుంటారు. ఈ గ్రామంలో గతం లో నక్సల్స్ చేతిలో మృతిచెందిన గుండ గోని మైసయ్యగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిస్తారు.
ఈ గ్రామంలోనే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొం టారు. అక్కడి ఎస్సీబస్తీలోని దళితుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. 3.30 గంటలకు నల్లగొండలోని బీజేపీ కార్యాల యానికి చేరుకుంటారు. సాయంత్రం హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన 400 మంది మేధావులతో సమావేశమవుతారు. అనంతరం రాష్ట్ర పార్టీ పదాధికారులు, 31 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. రాత్రి పార్టీ ఆఫీసులోనే బసచేస్తారు.
23న పర్యటన వివరాలు...
ఉదయం 9.15 గంటలకు నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలోని దళిత బస్తీలో పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ తో పాటు ఆ బస్తీకి దీన్దయాళ్నగర్గా నామకరణం చేస్తారు. ఉదయం 10.50 గంటలకు నాగార్జునసాగర్ నియోజక వర్గంలోని పెద్ద దేవులపల్లి గ్రామంలో పోలింగ్బూత్ కమిటీ సభ్యులతో సమావేశ మయ్యాక ఆ గ్రామ ప్రజలను కలుసుకుం టారు. సాయంత్రం 4 –5 గంటల మధ్య నల్లగొండలో విలేకరులతో మాట్లాడతారు.
24న గుండ్రాంపల్లిలో పర్యటన...
ఉదయం 9.45 నిముషాలకు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామాన్ని చేరుకుంటారు. గతంలో నిజాం పాలనలో రజాకార్ల ప్రైవేట్ సైన్యం చేతుల్లో 150 మందిని చంపి ఒక బావిలో పడేసిన ప్రాంతాన్ని సందర్శించి మృతులకు నివాళి అర్పిస్తారు, అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరి జిల్లాలోని భువనగిరికి చేరుకుని తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది మేధావులు, వివిధరంగాల ప్రముఖులతో సమావేశ మవుతారు. అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్లో భోజనం చేసి, సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బూత్స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. రాత్రి హరితప్లాజాలో బసచేస్తారు. 25న ఉద యమే విజయవాడ వెళతారు.
అమిత్షా పర్యటన షెడ్యూల్ ఖరారు
Published Sat, May 20 2017 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement