- ఫలించిన గవర్నర్ రాయబారం
- రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన సయోధ్య
- త్వరలోనే కేబినెట్ ఆమోదానికి ఫైలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతమున్న సచివాలయం కూల్చివేతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారులకు సంకేతాలు జారీ చేశారు. వచ్చే నెలలో లేదా డిసెంబర్ మొదటి వారంలో కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన అవరోధంగా ఉన్న ఏపీ సచివాలయం, ఏపీ కార్యాలయాలున్న భవానాలను సైతం ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.
స్వయంగా ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర్రావు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలసి కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలు, అందులో ఉన్న కార్యాల యాల తరలింపు అవసరాన్ని వివరిం చారు. రాష్ట్రాల పునర్విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ఏపీ ప్రభుత్వం సైతం సచివాలయంలోని కార్యాలయాలు ఖాళీ చేయాల్సిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వరుసలో గవర్నర్ రాయబారంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సచివాలయ భవనాల అప్పగింత విషయంలో అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలోని దాదాపు అన్ని కార్యాలయాలు ఇప్పటికే అమరావతి కొత్త రాజధానికి తరలి వెళ్లాయి. దీంతో ఎల్ బ్లాక్తో సహా తమ అధీనంలో ఉన్న అన్ని బ్లాక్లను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయంగా నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్ను ఏపీ ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యం లో ఏపీ సచివాలయ ప్రాంగణం స్వాధీ నం, సచివాలయం కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో ఒక తీర్మానాన్ని గవర్నర్కు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సిద్ధం చేసింది. సర్క్యులేషన్ విధానంలో ఈ ఫైలును మంత్రులకు పంపించి తీర్మానంపై సంతకాలు చేయించి, ఆ వెంటనే కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్కు పంపిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారంలోగా ఈ ప్రక్రియ పూర్తికి ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే సచివాలయం కూల్చివేత, కొత్త నిర్మాణానికి భూమిపూజ ముహూర్తాలు ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు.
క్యాంపు ఆఫీసులో ఆలయ పునఃప్రతిష్ఠ
బేగంపేటలోని సీఎం క్యాంపు ఆఫీసు వెనుక కొత్తగా నిర్మించిన అమ్మవారి ఆలయాన్ని గురువారం పునఃప్రతిష్ఠిం చనున్నారు. కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మా ణ నేపథ్యంలో గతంలో అక్కడ ఉన్న ఆలయాన్ని తొలిగించి.. అదే స్థలంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఉదయం 11.03 నిమిషాలకు జరిగే ఆలయ పునః ప్రతిష్ఠ పూజల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
సచివాలయం అప్పగింతకు ఏపీ ఓకే
Published Thu, Oct 20 2016 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement