'బాబు తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి' | Sakshi
Sakshi News home page

'బాబు తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి'

Published Wed, Dec 21 2016 3:48 PM

'బాబు తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి'

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మారుస్తున్నారని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. మాటపై నిలబడకపోవడం చంద్రబాబుకు అలవాటే అని ఆయన ఎద్దేవా చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 23న వెలగపూడిలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అవినీతిలో ఏపీని నంబర్‌ వన్‌ చేసిన ఘనత చంద్రబాబుదే అని, ఆయన తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని రఘువీరారెడ్డి అన్నారు.
 

Advertisement
Advertisement