భార్య కాపురానికి రావడం లేదని... | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని...

Published Thu, Oct 15 2015 11:16 PM

auto driver saidulu injured

చంపాపేట: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై ఫ్లెక్సీ పోలెక్కి ఓ వ్యక్తి జారిపడిన సంఘటన గురువారం చంపాపేట చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంపాపేట డివిజన్ నేతాజినగర్ కాలనీకి చెందిన సైదులు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సైదులుకు గత రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీతో వివాహమైంది. గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సైదులు భార్య లక్ష్మీ రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది.

తిరిగి కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన సైదులు చంపాపేట చౌరస్తాలోని మూడు అంతస్తుల భవనంపై ఉన్న 15 అడుగుల ఫ్లెక్సీ పోల్ ఎక్కాడు. అక్కడి నుంచి జారి 2వ అంతస్తు ఖాళీ స్థలంలో పడటంతో తలకు, కాళ్ళకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సైదులును స్థానికంగా ఉన్న డీఆర్‌డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.

Advertisement
Advertisement