* నీటి లభ్యతను బట్టి సాగునీరివ్వాలని తీర్మానం
* నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం
* ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై హరీశ్రావు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు నీరు విడుదల చేయాలని మంత్రుల బృందం తీర్మానించింది. అలాగే నీటి లభ్యతను బట్టి పాలేరు వరకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డుతో సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, నీటి వినియోగంపై శనివారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు నేతృత్వంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికాస్రాజ్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా ప్రాజెక్టులు, వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై మంత్రుల బృందం సుదీర్ఘంగా సమీక్షించింది.
దిగువ మానేరు ఆయకట్టుకు: దిగువ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి లభ్యతను అంచనా వేసి డ్యాం ఎగువ ప్రాంతాల్లోని పరిమిత ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. అలాగే లోయర్ మానేరు డ్యాం దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. వరంగల్తోపాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి 95 వేల ఎకరాలకు నీరివ్వాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పనులను ఆగస్టు నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ పరిధిలో గతం లో ఏటా రూ.60 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లిం చగా, ప్రస్తుతం ఆ భారాన్ని రూ.5 కోట్లకు పరిమితం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా చెరువు లు నింపే అవకాశాలపై కూడా సమీక్షించారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి
ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో జలాశయాల్లో చేరుతున్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని హరీశ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్రావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, సీఈలు సునీల్, ఖగేందర్రావు, భగవంతరావు, వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నుంచి పాలేరు దాకా..
Published Sun, Aug 14 2016 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement