- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణ బాధ్యత తెలంగాణదే
- అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ భారాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే భరించాలని తెలంగాణ, మహారాష్ట్ర సీఎం్ల నేతృత్వంలోని అంతర్రాష్ట్ర వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. పెన్గంగపై నిర్మించే ఛనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మాత్రం 80:20 నిష్పత్తిన భరించనున్నారు. ప్రాజెక్టుల కింద సాధ్యమైనంత వరకు ముంపును నివారించేందుకు తెలంగాణ సర్కారు ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం చేపట్టాలని.. బ్యారేజీల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రైవేటు భూములేవీ ముంపు కాకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. భూసేకరణ చట్టం లేదా భూ కొనుగోలు విధానం ద్వారా సేకరించే ముంపు భూములకు తెలంగాణే పరి హారం చెల్లించాలని నిర్ణయించారు.
వాటర్బోర్డు సమావేశం నిర్ణయాల మినిట్స్ కాపీని నీటి పారుదల శాఖ మంగళవారం విడుదల చేసింది. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకారం కుదరగా.. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో, ఛనాఖా-కొరాటాను 213 మీటర్ల ఎత్తుతో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రకారం... ఈ బ్యారేజీల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునే హక్కు మహారాష్ట్రకు ఉంటుంది. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు మహారాష్ట్రలోని బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. భూసేకరణ లేదా కొనుగోలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల నిర్వహణకు మహారాష్ట్ర సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పంచుకోవాల్సి ఉంటుంది.
బ్యారేజీల భారం రాష్ట్రానిదే
Published Wed, Aug 24 2016 2:35 AM
Related news
-
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్బోర్డు చెబుతోంది. -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
గొంతెండుతోంది!
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది. గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్వర్క్ మా‘నీరు’ తగ్గుతోంది కరీంనగర్తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహం కోసం.. దారి పట్టారు గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి. ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
టాస్క్ఫోర్స్ కార్యాలయంసాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ టాస్క్ఫోర్స్కు పోలీసుస్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
Advertisement