ఉప్పల్, కార్వాన్లలో అధికం
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో బీసీ జనగణన పూర్తయింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు హైకోర్టుకు అందజేసిన నివేదిక మేరకు బుధవారం రాత్రికి బీసీ గణన పూర్తి చేశారు. అయితే ఏ డివిజన్లో ఎంత శాతం బీసీలు ఉన్నారనే లెక్కలు రాత్రి పొద్దుపోయేంత వరకు సాగుతూనే ఉన్నాయి. గురువారానికి గానీ ఇవి ప్రధాన కార్యాలయానికి అందే పరిస్థితి లేదు. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు మొత్తం జనాభాలో బీసీలు దాదాపు 21 శాతం మాత్రమే ఉండటం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. 2009లో 26 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు తగ్గడానికి కారణాలేమిటనే అంశాలపై దృష్టి సారించారు. మరోమారు సరిచూసుకోవాల్సిందిగా సర్కిళ్లలోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే తగ్గినట్లయితే ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో.. ఎందుకు తగ్గారనే వివరాలు పొందుపరచాల్సిందిగా సూచించారు. అధికారిక సమాచారం మేరకు... మొత్తం జనాభా 70,68,495 కాగా... వీరిలో 50,75,520 (72 శాతం) మందికిసంబంధించిన సర్వే వివరాలు అందాయి. మొత్తం పూర్తయ్యేసరికిబీసీల శాతంలో స్వల్ప మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సర్కిళ్ల వారీగా ఇలా...
గ్రేటర్ మొత్తంలో బీసీలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలో ఉప్పల్, ఖైరతాబాద్-బి (కార్వాన్ నియోజకవర్గం) ముందున్నాయి. ఈ రెండు సర్కిళ్ల పరిధిలో 31 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. అత్యల్పంగా సర్కిల్-5 (బహదూర్పురా, చార్మినార్, గోషామహల్ నియోజక వర్గాలు)లో కేవలం 10.60 శాతం మాత్రమే ఉన్నారు.
వివిధ సర్కిళ్లలోని బీసీల శాతం ఇలా ఉంది...
కాప్రాలో 24.71, ఉప్పల్లో 31.29, ఎల్బీనగర్-ఎలో 20.03, ఎల్బీనగర్-బిలో 19.62, సర్కిల్-4ఏలో 22.43, సర్కిల్-4బిలో 22.82, సర్కిల్-5లో 10.60, రాజేంద్రనగర్లో 19.58, సర్కిల్-7ఎలో 27.18, సర్కిల్-7బిలో 31.16, సర్కిల్-8లో 16.07, సర్కిల్-9ఏలో 19.94, 9బీలో 19.67, ఖైరతాబాద్-ఎలో 14.51, ఖైరతాబాద్-బిలో 20.31, శేరిలింగంపల్లి-1లో 25.01, శేరిలింగంపల్లి-2లో 18.81, పటాన్చెరు, ఆర్సీపురంలలో 30.21, కూకట్పల్లి-ఎలో 15.04, కూకట్పల్లి-బిలో 21.56, కుత్బుల్లాపూర్లో 19.06, అల్వాల్లో 15.66, మల్కాజిగిరిలో 15.95, సికింద్రాబాద్లో 25.63గా శాతంగా ఉన్నాయి. మొత్తం 20.42 శాతంగా ఉంది.
- ఈనెల 24న ఓటర్ల జాబితా వెలువరించేందుకు, 26న బీసీల ముసాయిదా వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల తొలగించిన 6.30 లక్షల ఓటర్లలో దాదాపు 4.5 లక్షల ఓటర్లను తిరిగి చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 52 వేల మంది ఉన్నారు.
బీసీ గణన పూర్తి!
Published Thu, Nov 19 2015 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement