Sakshi News home page

ఒంటరి పోరుకు సిద్ధం: వెంకయ్య

Published Fri, Apr 18 2014 2:08 PM

ఒంటరి పోరుకు సిద్ధం: వెంకయ్య - Sakshi

టీడీపీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. మరికాసేపట్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేనిది ప్రకటిస్తాన్నారు. టీడీపీతో పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీమాంధ్రలోని 175 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. టీడీపీ, బీజేపీల పొత్తుపై శుక్రవారం చంద్రబాబు నాయుడు నివాసంలో తుది చర్చలు జరుగుతున్నాయి. మరో కాసేపట్లో చర్చలు ఓక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement