కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుపరిపాలన అందుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు సౌకర్యవంతమైన పాలన సాగుతోందన్నారు. అలాగే కేంద్ర పథకాలు, నిధులు అందకపోతే ప్రజలు నిలదీయాలని సూచించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో కలిసి మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 41ఏళ్లు పూర్తయ్యిందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో అప్పటి పరిస్థితులను వివరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎమర్జెన్సీ కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారన్నారు. దేశ వ్యాప్తంగా సుపరిపాలనకు చిహ్నం బీజేపీ మాత్రమే అని వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేందుకు ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం సమీక్షిస్తుంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రకటిస్తున్న పథకాలను, నిధులను లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రుల నిలయాలైన... నార్త్, సౌత్ బ్లాకుల వద్ద దళారులు రాజ్యమేలేవారని, తాము అధికారంలోకి వచ్చాక వారందరినీ తరిమేశామన్నారు.
పాలనలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వరన్యాయం చేకూరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రెండుగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. తమ హయాంలో తీవ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. పఠాన్కోట్దాడికి సంబంధించి పాకిస్తాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, ఈ ఘటనలో త్వరలో కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నారు. అలాగే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు విభజనపై ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఒక వినతిపత్రం అందజేశారు.
సుపరిపాలనకు చిహ్నం బీజేపీ
Published Mon, Jun 27 2016 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement