ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే | Sakshi
Sakshi News home page

ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే

Published Sat, May 7 2016 9:43 PM

bsc agriculture final year students also eligible for aeo posts

సాక్షి, హైదరాబాద్: వ్యవ సాయ శాఖలో ఖాళీగా ఉన్న 1000 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులేనని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టుల కోసం ఈనెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చినందున వారు దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో (www.tspsc.gov.in) పొందవచ్చని వివరించారు.

Advertisement
Advertisement