కేంద్రమంత్రి వెంకయ్యకు వైఎస్సార్సీపీ నేత భూమన సూచన
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. తన మాటలను నీటి మూటలు కాకుండా కార్యరూపం దాల్చేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి సూచించారు. సన్మాన సభల్లో సుద్దుల మాదిరిగా ఉత్తి మాటలు చెబితే సరిపోదని, లోక్సభలో రెండింట మూడొంతుల మెజారిటీ ఉన్నందున చిత్తశుద్ధితో చట్ట సవరణకు కృషి చేయాలని భూమన కోరారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోయినా అడిగే అధికారం లేకుండా పోయిందని, స్పీకర్ అధికార పార్టీ నుంచి వచ్చిన వారు కావడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అందుకే ఈ విచక్షణాధికారాన్ని స్పీకర్ల పరిధి నుంచి తీసేసి ఎన్నికల కమిషన్కు అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, తర్వాత చట్టం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 26న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా జాతీయ పార్టీల నేతలందరికీ ఈ విషయాన్ని సూచించారని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించిన అంశంపై లోక్సభ మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు.
బాబును ఎందుకు మందలించలేదు?
ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబును.. ఆయనకు ఆత్మీయుడైన వెంకయ్య హెచ్చరించి, వారించి ఉండాల్సిందన్నారు. శాంతిభద్రతల్లో రాష్ట్రం ఐదో స్థానానికి దిగజారిందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. గతంలో ఒకరిద్దరు చాలని చెప్పి.. ఇపుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్న చంద్రబాబును చూస్తుంటే కన్యాశుల్కంలో మరో గిరీశంలా మారారన్నారు.
మీ మాటలు నీటి మూటలు కాకుండా చూడండి
Published Sun, Jun 19 2016 1:43 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement