ఏఆర్సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇంటర్నే షనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహా య మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏఆర్సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలు, పదార్థాల ద్వారా దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలగనుం దన్నారు.
ఏఆర్సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపం చీకరణ భావన కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ స్వీయ శక్తిసామర్థ్యాలను గుర్తించి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ రంగంతోపాటు ఇతర రంగాలకు అవసరమైన టెక్నాలజీలు, పదార్థాలను అభివృద్ధి చేసిన ఏఆర్సీఐ.. అందుబాటులోని అవకాశాలను అందిపుచ్చు కునేందుకు స్వయంగా మార్కెటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం మేలని సూచించారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా కేంద్రం సరికొత్త పదార్థ విధాన ముసాయిదాను సిద్ధం చేస్తోందన్నారు.
విదేశీ కంపెనీలతో పోటీ పడేటప్పుడు స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఏఆర్సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలతో ఏర్పాటు చేసిన ఏఆర్సీఐటెక్స్ 2017ను సుజనా ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు. సూపర్ కెపాసిటర్తో నడిచే సైకిల్ని ఆసక్తిగా పరిశీలించి దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌరశక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఆర్సీఐ డీసీ కరెంట్తో నడిచే బల్బులు, ఫ్యాన్లు ఇతర పరికరాలను అభివృద్ధి చేయడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్సీఐ మాజీ డైరెక్టర్లు పద్మవిభూషణ్ పల్లె రామారావు, పద్మశ్రీ సౌందరరాజన్లు, పద్మభూషణ్ వి.ఎస్.రామ్మూర్తి, ప్రస్తుత డైరెక్టర్ పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు.
స్వశక్తిని గుర్తించాల్సిన తరుణమిది
Published Tue, Feb 28 2017 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement